Category Archives: Sliders

అభిమానుల ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ జన్మదిన వేడుకలు

అభిమానుల ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ జన్మదిన వేడుకలు

చిలకలూరిపేట :

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రతా శిరోద్కర్ జన్మదినోత్సవ సందర్బంగా చిలకలూరిపేట కృష్ణ మహేష్ యువత హీలింగ్ పీపుల్స్ సొసైటీ ఇ. శ్రీనివాస్ రెడ్డి ఫ్రెండ్స్ సర్కిల్ ఆద్వర్యం లో చౌత్ర సెంటర్ లో ని శివాలయం వద్ద శ్రీ వాసవి జ్ఞాన మందిరం లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేసి, ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషిత్ సామాజిక వైద్య శాల రక్త నిల్వ కేంద్రం వారికి అందజేశారు . ఈ కార్యక్రమం లో డా.రామ కృష్ణ గారు గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ స్టోరేజ్ టెక్నీషియన్ యస్ . ప్రసాద్, స్టాఫ్ నర్స్ లక్ష్మి, మరియు అభిమానులు నాజర్ వలి , షేక్ షంషుద్దీన్ , బషీర్ , నరేంద్ర పోతురాజు , సిద్ధిక్ , శివ , రామ కృష్ణ, హజరుద్దిన్ , షేక్ వల్యాసా , తిరుపతయ్య నాయక్ , నటరాజు, అంజిబాబు తదితర అభిమానులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్బంగా క్యాన్సర్ వ్యాధి తో భాద పడుతున్న హఫిజున్ , ఆమె మనవరాలు జాన్ బి మతి స్థిమితం లేక ఫిట్స్ తో భాద పడుతున్నందున రూ. 11 వేల ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది .

జంగారెడ్డిగూడెం :
జంగారెడ్డిగూడెం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రతా శిరోద్కర్ జన్మదినోత్సవ సందర్బంగా బవిరిశెట్టి మురళి కృష్ణ ఆద్వర్యం లో స్థానిక ఏరియా ఆసుపత్రి నందు సత్య సాయి బాబా ట్రస్ట్ లో రోగులు, అభిమానుల సమక్షం లో కేక్ కట్ చేసి వార్డ్ లో ని రోగులకు పాలు రొట్టెలు పంపిణి చేసి భోజన వసతి ని ఏర్పాటు చేసారు . మురళి కృష్ణ మాట్లాడుతూ అభిమానులు సేవ దృక్పధం తో సేవ కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమం లో 2020 క్యాలెండరు ను ఆవిష్కరించారు . రాపోలు భావన ఋషి , షేక్ వళ్ళి , షేక్ రజాక్ , కర్ణ పవన్ , తడికల పౌలు , పావలా చారి, రాంబాబు, పి . సురేష్ తదితర అభిమానులు పాల్గొన్నారు .

హైదరాబాద్:
R.T.C క్రాస్ రోడ్స్ లో ని సుదర్శన్ 35mm లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్బంగా, మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రతా శిరోద్కర్ జన్మదినోత్సవ సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు దిడ్డి రాంబాబు ఆద్వర్యం లో అభిమానుల సమక్షం లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు . ఈ కార్యక్రమం లో ప్రధాన కార్య దర్శి ప్. మల్లేష్, బ్యాంకు రాజు శ్రీనివాస్ గౌడ్, మహేందర్, డ్. వెంకటేష్, శివ, మోండా అశోక్,తదితర అభిమానులు పాల్గొన్నారు

విజయవాడ :
కృష్ణ జిల్లా విజయవాడ కృష్ణ లంక నల్ల గేట్ సెంటర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన సీనియర్ అభిమానం లొల్ల కృష్ణ మోహన్ ఆద్వర్యం లో ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్బంగా నిర్వహిస్తున్నట్టే మరియు ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో నిర్మించి, నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్బంగా రక్త దానం నిర్వహించారు . ఈ రక్త దాన శిబిరాన్ని నగర వై. సి. పి . అధ్యక్షులు బొప్పన భావ కుమార్, ప్రారంభించి అభిమానులు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తమ హీరో లకు ఆదర్శంగా నిలిచి మానవత్వం చాటుకుంటున్నారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో వై. సి. పి .నాయకురాలు నిమ్మల జ్యోతిక తో పాటు అభిమానులు బడుగు సురేష్ , ప్రకాష్, డ్. యల్. ప్. సుబ్బా రెడ్డి, గుండు శ్రీనివాస్ రావు , కే. ప్. సీరం బుజ్జి, వేగి దుర్గ రావు, తదితర అభిమానులు పాల్గొన్నారు .

Related Images:


శ్రీమాతా క్రియేషన్స్ సుమన్, షియాజి షిండే ముఖ్య పాత్రల్లో వస్తోన్న సత్యం చిత్రం మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి !!!

శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం. నవంబర్ 2019లో అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

త్వరలో ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కె.మహాంతేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అవినాష్, రంజిని రాఘవన్, వినయ్ ప్రసాద్, శృంగేరి రమణ, ఉమ , బసవ రాజు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కెజిఎఫ్ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బన్సురు ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. సినిటెక్ సూరి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ మూవీకి కెవి.రాజు మాటలు రాస్తున్నారు అలాగే ఈ మూవీకి ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎదురూరి అంజిబాబు వ్యవహరిస్తున్నారు.

Related Images:


దర్శకుడిగా మారుతున్న నిర్మాత విశ్వనాథ్ తన్నీరు

సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు ఇటీవల “యమ్ 6” వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు, ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.

ఈ సందర్భంగా విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ….
ఈ క్రొత్త ప్రాజెక్ట్ విశేషాలను తెలియజేసారు . సినిమా మీద ప్యాషన్ తో ఈరంగం లోకి వచ్చిన నేను “యమ్ 6” సినిమా తో నిర్మాతగా మారా . ఐతే నాకు దర్శకుడు కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది . ఈ క్రమంలో ఎన్నో కథలు విన్నా . చివరకు ఓ అద్భుతమయిన కథ దొరికింది . కంటెంట్ ఆధారం గా నిర్మితమవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది . అలాగే ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం . ముఖ్యంగా ఈ చిత్రం లోని క్లైమాక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది . ఈ సినిమా లో హీరోగా మా గత చిత్రం “యమ్ 6 “లో హీరో గా చేసిన ధ్రువ ను ఎంపిక చేసాం. తనలో మంచి టాలెంట్ ఉంది . ఈ క్యారెక్టర్ కి తను బాగా మ్యాచ్ అవుతాడు . ఈ సినిమా ఫిబ్రవరి నెల లో హైదరాబాద్, రెండో షెడ్యూల్ వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కంప్లీట్ చేస్తాము. ఇలా 4 షెడ్యూల్స్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం అన్నారు . రాగిణి, డి.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , దిల్ రమేష్ ,శివమ్ శివరాత్రి, గిరి , తిలక్ , నర్సిరెడ్డి , చంటి , సందీప్ , కుమరం మొదలగువారు నటిస్తున్నారని తెలిపారు.

హీరో ధ్రువ మాట్లాడుతూ…
M6 సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేసిన విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు. ఆయన దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఇది, నాకు రెండో సారి ఈ వినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో నేను మరింత పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతాను. ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్ కు వెళ్లి కంటిన్యూటి షెడ్యూల్ లో షూట్ కంప్లీట్ చెయ్యబోతున్నాము అన్నారు.

ఆర్టిస్ట్స్:
హీరో ధ్రువ, రాగిణి, డి.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , దిల్ రమేష్ ,శివమ్ శివరాత్రి, గిరి , తిలక్ , నర్సిరెడ్డి , చంటి , సందీప్ , కుమరం

టెక్నీషియన్స్:
కథ , మాటలు:వేమగిరి , మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ కూరాకుల
పాటలు :మౌనశ్రి మాలిక్
ఎడిటింగ్ : సోమేశ్వర్ పోచం
పిఆర్ఓ: మధు. విఆర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ : గుర్రపు విజయ్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం: నిర్మాత : విశ్వనాధ్ తన్నీరు

Related Images:


విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో నేచుర‌ల్ స్టార్ నాని… `వి` సినిమాలో నాని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో నేచుర‌ల్ స్టార్ నాని… `వి` సినిమాలో నాని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అష్టాచ‌మ్మా, జెంటిల్‌మ‌న్ వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో నేచుర‌ల్‌స్టార్ నానిని స‌రికొత్త‌గా ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `వి`. ఈసారి కూడా డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో కొత్త పాత్ర‌లో నానిని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం `వి` సినిమా చూడాల్సిందే. సాంపుల్‌గా నాని లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాని పోషించ‌ని స‌రికొత్త పాత్ర‌, లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. గ‌డ్డం, మెలితిప్పిన మీసాలు, చేతిలో క‌త్తెర‌, చేతికి ర‌క్తం, చూపుల్లో నిర్ల‌క్ష్యం ఇవ‌న్నీ చూస్తుంటే నాని పాత్ర‌లోని డెప్త్ అర్థం చేసుకోవ‌చ్చు.

క్లాస్, మాస్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న నాని తొలిసారి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాక్ష‌సుడి త‌ర‌హా పాత్ర‌లో నాని క‌న‌ప‌డ‌తార‌ని హీరో సుధీర్‌బాబు ఇది వ‌ర‌కే ట్వీట్ కూడా చేశారు. రాక్ష‌సుడి బారి నుండి కాపాడే సేవియ‌ర్ పాత్రధారి ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్‌గా సుధీర్‌బాబు న‌టిస్తున్నారు. నాని, సుధీర్‌బాబు పాత్ర‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పోటాపోటీగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

నేను లోక‌ల్‌, ఎంసీఎ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు.. నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం కావ‌డం విశేషం. నానితో ఒక ప‌క్క ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి, మ‌రో ప‌క్క నిర్మాత దిల్‌రాజు రూపొందిస్తోన్న హ్యాట్రిక్ చిత్రం `వి` కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్ర‌మిది. ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి25న విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు:
నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
మ్యూజిక్‌: అమిత్ త్రివేది
సినిమాటోగ్ర‌ఫీ: పి.జి.విందా
ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
నిర్మాత‌లు: రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

Related Images:


ఏప్రిల్ 28 ఏం జరిగింది?


ఏప్రిల్ 28 ఏం జరిగింది?

సరికొత్త కథాంశంతో జనరంజకమైన అంశాలతో రూపొందే సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. వైవిధ్యాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రానికి కూడా విజయాన్ని అందిస్తారని నమ్ముతున్నానుఅన్నారు దర్శకుడు వీర గనమాల. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది.టైటిల్‌తోనే ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ప్రేక్షకుల్లోమరింత ఉత్కంఠను రేపింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో, ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో అనుక్షణం ఉత్కంఠగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా కొనసాగే ఈ చిత్రంలో ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా వుంటుంది. త్వరలో బ్యాంకాంక్‌లో జరిగే పాట చిత్రీకరణతో చిత్రం పూర్తవుతుంది. మార్చి నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. అజయ్, రాజీవ్‌కనకాల, తనికెళ్లభరణి, చమ్మక్‌చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్ ఎన్, స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా, మాటలు, పాటలు: ధర్మతేజ, రామాంజనేయులు, ఎడిటర్:కె.సంతోష్, కథ-మాటలు-దర్శకత్వం: వీర గనమాల

Related Images:


బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ ‘రైట్ రైట్ బగ్గిడి గోపాల్’ బయోపిక్ ఫిబ్రవరి 28న విడుదల

బగ్గిడి ఆర్ట్స్ మూవీస్, మాస్టర్ బగ్గిడి చేతన్ రెడ్డి, మాస్టర్ బగ్గిడి నితిన్ సాయి రెడ్డి సమర్పించు బగ్గిడి గోపాల్. అర్జున్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కాబోతొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం అయ్యారు.

ఈ సందర్బంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
అందరికి నమస్కారం. సుమన్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది, ఆయన నటిస్తోన్న ఈ బగ్గిడి గోపాల్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న. చిన్న నిర్మాత చేస్తున్న ఈ సినిమాకు మా అందరి సపోర్ట్ ఉంటుంది. బయోపిక్ లు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి, అలాంటి నేపథ్యంలో వస్తోన్న ఒక బయోపిక్ సినిమా ఇది. బగ్గిడి గోపాల్ అనే బయోపిక్ లో ఒక సామాన్య బస్ కండెక్టర్ ఏంఎల్ఏ గా ఎలా ఎదిగాడు అనే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. సుమన్ గారు ఈ మూవీలో ఒక పోలీసు అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఫిబ్రవరి 28న విడుదల కాబోతున్న ఈ సినిమా సక్సెస్ కావాలని తెలిపారు.

సుమన్ మాట్లాడుతూ…
ఒక సామ్యన్య బస్ కండెక్టర్ పెద్ద స్థాయికి ఎలా వెళ్ళాడు అనే అంశం ఈ సినిమాలో బాగా చూపించారు డైరెక్టర్ అర్జున్ కుమార్. ఈ సినిమా కథ ఆదర్శంగా ఉంటుంది. నేను ఈ సినిమాలో ఒక పోలీస్ అధికారి రోల్ లో కనిపిస్తాను. కొత్త నిర్మాత అయిన బగ్గిడి గోపాల్ ఈ సినిమాను బాగా తీశాడు, డైరెక్టర్ అర్జున్ కుమార్ సినిమాను అద్భుతంగా ఆవిష్కరించారు. రొటీన్ కు భిన్నంగా ఈ సినిమా ఉండబోతొంది. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ…
1982 లో మార్చి లో రాజకీయాల్లో జరిగిన కొన్ని కీలక మార్పులు జరిగాయి. అదే రోజు నేను ఎన్టీఆర్ తో పాటు నడవడం జరిగింది. తాను పెట్టిన టిడిపి పార్టీలో నేను చేసిన కృషి , సేవలు ఈ బగ్గిడి గోపాల్ చిత్రంలో చూపించడం జరిగింది. ఫిబ్రవరి 23న ఈ సినిమా విడుదల కాబోతొంది. సెన్సార్ పూర్తి చేసుకున్న మా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నాము. ఈ సినిమాను మా కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నాను. నా గురించి, నా జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలు ఈ మూవీలో చెప్పడం జరిగిందని తెలిపారు.

ఎక్స్ ఎమ్ఎల్ఏ సంజయ్ రావు మాట్లాడుతూ….
బగ్గిడి గోపాల్ గారు ఎమ్ఎల్ఏ అయిన తరువాత జరిగిన అన్ని సంఘటనలు నాకు తెలుసు. ఆయన చేస్తున్న బగ్గిడి గోపాల్ సినిమాలో నిజాలు చూపించారు. ముక్కుసూటి మనిషి అయిన బగ్గిడి గోపాల్ ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి అనేక అంశాలు ఈ బగ్గిడి బయోపిక్ లో పెట్టడం జరిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

హీరోయిన్ చందన మాట్లాడుతూ…
అందరికి నమస్కారం. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు. నాకు ఈ మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ ఇష్టం, ప్రధానంగా గోపాలన్న సాంగ్ నాకు ఇష్టమని తెలిపారు.

డైరెక్టర్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ…
నేను ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యడంతో పాటు ఒక పాత్రలో నటించాను. బగ్గిడి గోపాల్ గారు నిజాయితీ కలిగిన వ్యక్తి, ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాము, ఫిబ్రవరి 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము, మా సినిమాకు మీడియా అందరి సపోర్ట్ కావాలని కోరారు.


బ్యానర్: బగిడి ఆర్ట్ మూవీస్
సినిమా: బగిడి గోపాల్
ఆర్టిస్ట్స్: సుమన్, కవిత, ప్రభావతి, మహేష్, తేజ
హీరో: రమాకాంత్
హీరోయిన్: సిరి చందన
డైరెక్టర్: అర్జున్ కుమార్
ప్రొడ్యూసర్: బగిడి గోపాల్
కెమెరామెన్: ప్రవీణ్ కుమార్
స్టంట్స్ & కోడైరెక్టర్: అవిష్ పూరి
మ్యూజిక్: జయసూర్య బుప్పేం
పిఆర్ఓ: మధు.విఆర్

Related Images:


ఫిబ్రవరి 7న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రచార చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘వీరి నాయుడుగారి అబ్బాయి శ్రీనివాస్‌, మేం కలిసి ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి ఈ సినిమా చేశాం. ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. కథ, కథనాలు కొత్త తరహాలో ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. న్యూ ఏజ్ సినిమా ఇది’’ అని అన్నారు.

నటీనటులు:
ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
అసోసియేట్‌ డైరెక్టర్‌: లక్కీ బెజవాడ, ఎడిటర్‌: తెల్లగుటి మణికాంత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్‌ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: నేహా మురళి, రఘురామ్‌ ఎరుకొండ, ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని, సంగీతం: వికాస్‌ బడిజ, కో–డైరెక్టర్‌, డైలాగ్స్‌: విజయ్‌ కామిశెట్టి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌, రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.

Related Images:


‘బాలికా వధు’ ఫేమ్ షీతల్ ఖండల్

తెలుగులోనూ రాణించాలన్నదే నా కోరిక
‘బాలికా వధు’ ఫేమ్ షీతల్ ఖండల్

దేశవ్యాప్తంగా బుల్లి తెర ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘బాలికా వధు’ సీరియల్ లో ‘గెహనా’గా నటించిన షీతల్ ఖండల్ గురించి తెలియనివారు ఉండరు. ఈ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరుతొ తెలుగులోనూ ప్రసారమై ఇక్కడి ప్రేక్షకుల హృదయాలు కూడా గెలుచుకొంది. ‘బాలికా వధు’తో వచ్చిన గుర్తింపు షీతల్ ను ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమెను వరించాయి. ‘వారియర్ సావిత్రి’ అనే హిందీ సినిమాలోనూ నటించి మెప్పించిన షీతల్.. తన మాతృ భాష రాజస్తానీలో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలకు సైన్ చేసి.. ఒక ఇండో అమెరికన్ సినిమాలోనూ నటిస్తున్న షీతల్.. త్వరలోనే తెలుగులోనూ తెరంగేట్రం చేయాలని తహతహలాడుడుతోంది. సహజసిద్ధమైన అందం, అభినయం, శభాష్ అనిపించే నాట్య కౌశలం కలిగిన ఈ రాజస్థానీ భామకు తెలుగులో ఎవరైనా పిలిచి అవకాశాలు ఇస్తారేమో వేచి చూడాలి!!

Related Images:


ఆసక్తి రేపుతున్న ‘ పలాస 1978’ లోని పాత్రలు

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సందర్భంగా ‘పలాస 1978 ’ లోని కొన్ని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఈ బుక్ ని సోషల్ మీడియా లో చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ లాంచ్ చేసారు. ఈ యానిమేటడ్ బుక్ లో యూనిట్ పరిచయం చేసిన పాత్రలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. అణువణువునా సహాజత్వం నింపుకున్న ఈ పాత్రల మాటలు కూడా అంతే హృద్యంగా ఉన్నాయి. ముఖ్యంగా పలాస ప్రాంతం నుండి పుట్టిన మాటల లోని భావాలు లోతుగా ఉన్నాయి.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ:
‘‘ఈ సినిమాలోని పాత్రలు మాట్లాడే మాటలు రెగ్యులర్ సినిమాలలో ఉండే లా కాకుండా కంటెంట్ బేస్డ్ గా ఉన్నాయి. సినిమా కథ ఎంత సీరియస్ గా సాగుతుందో ఈ మాటలలో అర్ధం అవుతుంది. సినిమా కథ లోతుగా, సీరియస్ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. పాత్రల పేర్లు, వేష బాషలు చాలా సహాజంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో జరిగిన కథ, ఇది వరకూ ఎవరూ చెప్పని కథ అంటూ మొదలైన ఈ యానిమేటడ్ బుక్ మొదటి పేజి నుండి చివరి పేజీ వరకూ ఆసక్తిగా ఉంది. ఇందులోని పాత్రలు ప్రత్యేక ముద్రను వేసాయి. ’’ అన్నారు.

కథ లోని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో పరిచయం చేసింది చిత్ర యూనిట్. విడుదలకు ముందే పరిశ్రమలో ‘పలాస 1978’ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను తెచ్చుకుంది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈమూవీ తెలుగు అసురన్ అవుతుందని దర్శకుడు మారుతి కితాబిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతం లోని కథ, ఎవరూ చెప్పని కథ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫ్రిబ్రవరి లో విడుదలకు సిద్దం అవుతుంది.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె,
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.

Related Images: