Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
3 i ఫిలిమ్స్ సమర్పణలో మజిలీ సినిమా ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి,సాకేత్,వెంకట కృష్ణ,చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం “సూసైడ్ క్లబ్”. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3 i ఫిలిమ్స్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కు సంబందించిన ట్రైలర్ ను సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ లాంచ్ చేసారు.ఈ సందర్భంగా సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ. “సూసైడ్ క్లబ్” ట్రైలర్ ను ఇప్పుడే చూడటం జరిగింది.మేకింగ్,సినిమాటోగ్రఫీ,కటింగ్ చాల స్టైయిలిష్ గా ఉన్నాయి.నాకు చాల ఆనందంగా ఉంది ఈ కొత్త జనరేషన్ ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తున్నందుకు.డైరెక్టర్ శ్రీనివాస్ చాలా బాగా తీసాడు.డైరెక్టర్ శ్రీనివాస్ కు మరియు టీం అందరికి అల్ ది బెస్ట్ అని.అన్నారు.డైరెక్టర్ శ్రీనివాస్ బొగడపాటి మాట్లాడుతూ.లెజెండరి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారు మా సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసినందుకు మాకు చాల ఆనందంగా ఉంది.ఆయన చాల బిజి గా ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నం.అన్నారు.
శివ రామాచద్రవరపు,ప్రవీణ్ యండమూరి,చందన, సందీప్ రెడ్డి,వెంకట కృష్ణ,సాకేత్ సింగ్ నటించిన ఈ చిత్రానికి రైటర్ మరియు డైరెక్టర్: శ్రీనివాస్ బొగడపాటి,ప్రొడ్యూసర్: 3 i ఫిలిమ్స్ అండ్ ప్రవీణ్ ప్రభు వెంకటేశం,మ్యూజిక్: కున్ని గుడిపాటి,ఎడిటర్: డే సెల్వ,ఆర్ట్: శాన్ నవార్,విజువల్స్: పవన్ కుమార్ తడక,కుమార్ నిర్మల సృజన్,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,సౌండ్: రాఘవ చరణ్.
సూపర్స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సూపర్స్టార్ మహేశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
ఇలాంటి సంక్రాంతిని ఇంత వరకూ చూడలేదు!!
సూపర్ ప్రొడ్యూసర్ దిల్రాజు మాట్లాడుతూ – ”నేను ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలైంది. ఇలాంటి సంక్రాంతి ఇప్పటివరకూ చూడలేదు. కేవలం ఐదు నెలల్లోనే సూపర్స్టార్ మహేష్, అనిల్ రావిపూడి ఈ సినిమా కంప్లీట్ చేసి సరిలేరు మాకెవ్వరు అన్పించారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్ అనే రేంజ్లో రెవెన్యూ క్రియేట్ చేసి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిజమైన సంక్రాంతి అనుకునేలాగా చేశారు. అనిల్ ఇప్పటివరకూ అయిదు సినిమాలు చేశారు. అయిదురు హీరోలకి వారి కెరీర్ బెస్ట్ సక్సెస్ ఇచ్చారు. అలాగే ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్కిగానీ, మా బేనర్కి గానీ హయ్యస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసిన సినిమాగా క్రియేట్ చేశారు. ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం. అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి ఎంత ప్రాఫిట్ కావాలో అంత ప్రాఫిట్ క్రియేట్ చేసి ఇచ్చారు. సంక్రాంతికి రావాలనే ఒక్క సంకల్పంతో అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా అయిదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసిన మహేష్బాబుగారికి థాంక్స్. ఈ సంక్రాంతికి ఇంత మంచి రెవెన్యూ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.
అనిల్కి ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అఛీవ్మెంట్!!
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ”సంక్రాంతి ముగిసింది. పండగ సినిమాలకి ఇంకా సంక్రాంతి నడుస్తూనే ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మహేష్గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఒక సూపర్స్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే సాధారణ విషయం కాదు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అఛీవ్మెంట్. అనిల్ కష్టానికి తగ్గ ప్రతిఫలం మా అందరికీ లభించింది. ఈ సినిమాకి దిల్రాజుగారి కోపరేషన్ మరువలేనిది. మేం ఏదైతే అనుకున్నామో దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలోనే ది బెస్ట్ సంక్రాంతి అని మా డిస్ట్రిబ్యూటర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంక్రాంతిలో మా సినిమా ఉండటం నిజంగా మా అదృష్టం” అన్నారు.
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోతోంది!!
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – ”అందరూ చెప్పినట్లే తెలుగు సినిమా కళకళలాడుతోంది. సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోతోంది. ఐయాం వెరీ హ్యాపీ. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసి మహేష్గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా రెండు మూడు వారాలు రన్ ఉంది. అలాగే రిపీటెడ్గా చూడాలనుకునే ఆడియన్స్ కోసం ఒకటిన్నర నిమిషాల నిడివి గల సన్నివేశాన్ని యాడ్ చేస్తున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్గా లభిస్తాయి. ‘రమణా లోడు ఎత్తాలిరా’ అనే డైలాగ్కు మేం ఊహించినదాన్ని కన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.అందుకే మేము కూడా ‘రమణా బాక్సాపీస్ లోడ్ ఎత్తాలిరా’ అంటున్నాం. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఎంతో గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు.
Megastar Chiranjeevi’s nephew and Sai Dharam Tej’s younger brother Vaishnav Tej is getting introduced as hero and the film is officially titled ‘Uppena.’
Buchi babu Sana who worked as associate to legendary director Sukumar is directing his debut film Uppena for which first look poster is being released tomorrow at 4:05 pm.
Newgirl Krithi Shetty is also making her debut with this film while Tamil star actor Vijay Sethupathi is playing an important role.
Hero, heroine and actor Brahmaji will be taking part in Puri schedule of shooting.
‘Rockstar’ Devi Sri Prasad will be composing music while Shamdat Sainudeen will handle the cinematography.
Mythri Movie Makers is producing ‘Uppena’ in association with Sukumar Writings banner.
Crew:
Story & Direction: Buchi Babu Sana
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Executive Producer: Anil Y
CEO: Cherry
Banner: Mythri Movie Makers, Sukumar Writings
Cinematography: Shamdat Sainudeen
Music director: Devi Sri Prasad
Editor: Naveen Nooli
Art Director: Mounika Ramakrishna
Pro: Vamsi Shekar, Madhu Maduri
షింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన హీరో ఫస్ట్లుక్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 22న ఈ చిత్రం నుండి హీరోయిన్ గ్లింప్స్ ని విడుదలచేసింది చిత్ర యూనిట్. సలోని మిశ్రా ఎలక్ట్రిఫాయింగ్ పోలీస్ ఆఫీసర్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తోంది. దర్శకుడు శివకు ఇది మొదటి సినిమా అయినా చాలా స్టైలిష్ గా తెరకెక్కించారని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతోంది.
అనంతపురంలో ప్రారంభమైన విక్టరీ వెంకటేష్ పవర్ ఫుల్ మూవీ ‘నారప్ప’
‘ఎఫ్2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్బస్టర్ హిట్స్తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్ షూటింగ్ బుధవారం అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. మొదటి సన్నివేశాన్ని విక్టరీ వెంకటేష్ పై చిత్రీకరించారు. తమిళ్లో బ్లాక్బస్టర్ హిట్గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ని రివీల్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ‘నారప్ప’ గెటప్లో విక్టరీ వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్గా ఉంది. మాస్ గెటప్లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ప్రైజ్ చేశారు విక్టరీ వెంకటేష్. రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.
`ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా….` అనే హార్ట్ టచింగ్ మెలోడీ సాంగ్తో ఆకట్టుకుంటున్న `జాను`.. ఫ్రిబ్రవరి 7న సినిమా గ్రాండ్ రిలీజ్
శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `జాను`. ఈ సినిమాలో తొలి లిరికల్ వీడియో సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
“ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ
తారా తీరం మన దారిలోకాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా…“ అంటూ హార్ట్ టచింగ్ మెలోడీ ప్రేమలోని గాఢత ఈ పాటలో తెలియచేస్తుంది.
గోవింద్ వసంత సంగీత సారథ్యంలో శ్రీమణి రాసిన ఈ పాటను చిన్నయి, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన టీజర్కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మిగిలిన పాటలను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
యూవ హీరో నాగ శౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన అశ్వద్ధామ మూవీ టీజర్ ను ఇటీవల సమంత విడుదల చేసిన సంగతి తెలిసిందే, టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేయబోతున్నాడు.
అశ్వద్ధామ ట్రైలర్ జనవరి 23న సాయంత్రం 5.04 గంటలకు పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదల కాబోతొంది. అందరి అంచనాలకు తగ్గటు ట్రైలర్ ఉండబోతొంది.
నాగ శౌర్య సరసన మెహిరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనకు ఆధారంగా తెరకెక్కింది. అశ్వద్ధామ జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.