Category Archives: Sliders

నన్ను సరికొత్తగా చూడాలన్న నాన్నగారి అభిమానుల, నా అభిమానుల కోరికను `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో

నన్ను సరికొత్తగా చూడాలన్న నాన్నగారి అభిమానుల, నా అభిమానుల కోరికను `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో
నెరవేర్చిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్యూ- సూపర్‌స్టార్‌ మహేశ్.

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌సమర్పణలోజి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది.ఈ సంద‌ర్భంగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్‌ను జ‌న‌వ‌రి 17 (శ‌నివారం)న వ‌రంగ‌ల్ హ‌న్మ‌కొండ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు స్టేడియంలో అశేష అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి వర్యులు ఎర్ర బెల్లి దయాకర్ రావు, ఎంఎల్ఏ వినయ్ భాస్కర్, వరంగల్ సిపి రవిందర్ పాల్గొన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు` చిత్రం మొదటి వారంలోనే 100 కోట్ల షేర్ రాబట్టిన సందర్భంగా చిత్ర‌ డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ సంయుక్తంగా
పోస్టర్ ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో…

యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ – “ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ వరుసగా మూడు సినిమాలలో మాకు అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఫైట్ సీక్వెన్సులకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరిచ్చే ప్రోత్సాహంతోనే ఇంత దూరం రాగలిగాము. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు” అన్నారు.

నటుడు అజయ్ మాట్లాడుతూ – ” మహేష్ గారితో `ఒక్కడు` సినిమా నుండి అసోసియేట్ అవుతున్నాను. మళ్ళీ ఇన్నేళ్లకి కొండా రెడ్డి బురుజు దగ్గర సెట్ చూడగానే నోస్టాలజి ఫీలింగ్ వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి గారికి, నిర్మాత అనిల్ సుంకర గారికి ధన్యవాదాలు” అన్నారు.

దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ – “చాలా పాజిటివ్ వైబ్స్ మధ్య ఈ సినిమా ప్రారంభం అయింది. అన్ని ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా కలగలిపి అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హీరోయిజం కామెడీ అన్ని అంశాలు ఉండేలా చాలా శ్రద్ద తీసుకున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ వినగానే గుంటూరు ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తీసుకొని పద్మాకర్ సినిమాస్ ద్వారా రిలీజ్ చేశాం. అక్కడ మహేష్ బాబు గారి కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్ ని ఈ సినిమా క్రాస్ చేసింది. సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేము. తెలుగు సినీ పరిశ్రమకి ఈ సంక్రాంతికి గొప్ప వరం ‘సరిలేరు నీకెవ్వరు” అన్నారు.

నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ – “పండుగ అంటే అర్ధం ఏంటో నా కళ్లతో చూస్తున్నాను. ఈ పండుగకి పండుగ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి, అలాగే సినిమా అంతా వారి పక్కనే ఉండి నటించే అవకాశం ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ గారికి మరియు చిత్ర నిర్మాతలకి నా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి గారితో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా ఇంత పెద్ద విజయవంతం కావడానికి కారణమైన ప్రేక్షకులకి ధన్యవాదాలు” అన్నారు.

డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – “ఇంతకు ముందే డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు మొదటి వారంలోనే లాభాలు వస్తున్నాయని..ఈ సినిమా బ్లాక్ బస్టరా అంతకుమించా అనేది ఎంత చెప్పిన సరిపోదు. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి గారు మంచి పాత్రలో నటించారు. అనిల్ సుంకర గారికి దిల్ రాజు గారు మంచి సపోర్ట్ ఇచ్చారు . దేవి మహేష్ గారికి వరుసగా మూడు సినిమాలకి బ్లాక్ బస్టర్ ఆల్భ‌మ్స్‌ ఇచ్చారు. మహర్షి సక్సెస్ మీట్ లో అనిల్ చెప్పారు మహేష్ గారిలో ఒక హ్యాపినెస్ చూస్తున్నాను అది కంటిన్యూ చేస్తాను అని. దానికి మించి హ్యాపినెస్ ఇచ్చాడు అనిల్. దీనికి మించిన హ్యాపినెస్ ని కొనసాగించాల్సిన భాద్యత ఇప్పుడు నాది. తప్పకుండా కంటిన్యూ చేస్తాను” అన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ – “ఈరోజు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నా..ఎందుకంటే వరంగల్ పట్టణంలో దిల్ రాజు గారు రెండవ ఫంక్షన్ ని నా మాట మీద ఏర్పాటు చేశారు. అందుకు ఆయనకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మాస్ లీడర్, మా మిత్రులు కృష్ణ గారి కొడుకు మహేష్ గారికి స్వాగతం. మహేష్ స్వయంగా ఫోన్ చేసి వరంగల్ వస్తున్నాను. ఈవెంట్ ని సక్సెస్ చేయాలి అని కోరినప్పుడు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. అలాగే డైనమిక్ లీడర్ విజయశాంతి గారికి దన్యవాదాలు. దాదాపు గా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీరందరిని ఒక్కటే కోరుకుంటున్నాను హైదరాబాద్ తర్వాత వరంగల్ ని సినీ పరిశ్రమకు అడ్డాగా మీరు ఎన్నుకోవాలి. దానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు మహేష్ బాబు గారికి దన్యవాదాలు. మీరు కృష్ణ గారి కొడుకు.. మీరు వస్తానంటే మా వరంగల్ ప్రజలు పండుగ చేసుకుంటారు. మీరింకా సక్సెస్ అవుతారు. నెం1 హీరో అవుతారు” అన్నారు.

మొదటి వారంలోనే 100 కోట్ల షేర్ ని అనౌన్స్ చేయడం సంతోషంగా ఉంది!!
చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – “అందరూ బాబు ఈ సినిమాలో మాస్ చేశారు బ్లాక్ బస్టర్ కావాలి అన్నారు. కానీ బ్లాక్ బస్టర్ సరిపోలేదు బ్లాక్ బస్టర్ కా బాప్ అయింది. మైండ్ బ్లాక్ ఒక్క సాంగ్ చాలు సినిమా ఏ రేంజ్ కి తీసుకువెళ్తుంది అనేదానికి. ఈరోజు ఏడవ రోజు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రాఫిట్స్ లోకి వచ్చారని వారి మోహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి మొదటి రోజు నుండి మాకున్న నమ్మకాన్ని కలెక్షన్స్ రూపంలో తీసుకువచ్చారు. మహేష్ బాబు అభిమానిగా నాది ఒకటే కోరిక ప్రతి సినిమాలో ఒక మైండ్ బ్లాక్ సాంగ్ కావాలి. ఎందుకంటే థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు మైండ్ బ్లాక్ సాంగ్ ఒకెత్తు. అన్ని వయసుల వారు డాన్స్ వేస్తున్నారు. అలాగే 13 ఏళ్ల తర్వాత విజయశాంతి గారు నటించారు. ఆమెకు ఇది పర్ఫెక్ట్ రీ ఎంట్రీ అని మేము భావిస్తున్నాము. దూకుడు సినిమాకి 100కోట్ల గ్రాస్ ని నేనే అనౌన్స్ చేశాను. ఇప్పుడు మొదటి వారంలోనే 100 కోట్ల షేర్ ని అనౌన్స్ చేయడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి నా నమస్కారాలు” అన్నారు.

ఏడు రోజుల్లోనే ఒక సినిమా ప్రాఫిట్స్ లోకి వెళ్లడం చాలా అరుదు!!
చిత్ర సమర్పకులు దిల్ రాజు మాట్లాడుతూ – “మా సినిమా సక్సెస్ అయితే తిరుపతికి వస్తాము అని మొక్కుకున్నాం. మాములుగా తిరుపతి వెళ్లి ఇంటికి వెళ్తాము.. కానీ ఇదే మా ఇల్లు అనుకొని మా యూనిట్ మొత్తం తిరుపతికి వెళ్లి నేరుగా వ‌రంగ‌ల్‌కే వచ్చాం. రెండు రోజుల్లోనే ఈ ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లు చేసిన ఎర్రబెల్లి దయాకర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి మా దన్యవాదాలు. ఆరు ఏడు రోజుల్లోనే ఒక సినిమా ప్రాఫిట్స్ లోకి వెళ్లడం అనేది చాలా అరుదు అది మా సినిమాకి వచ్చినందుకు హ్యాపీ. మా దర్శకుడు అనిల్ రావిపూడి చేసింది అయిదు సినిమాలు. అయిదు సినిమాలతో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ని హ్యాపీ గా ఉంచడం ఒక్క అనిల్ కే సాధ్యం అయింది. అనిల్ ఇలాగే సక్సెస్ ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. విజయశాంతి గారు 13 ఏళ్ల తరువాత మా సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. మహేష్ గారు ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’తో హ్యాట్రిక్ సాధించారు. ఆయన సక్సెస్ లు ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – “మహేష్ బాబు గారితో ఇలాంటి జోనర్ చేయాలని చాలా రోజుల నుండి కోరిక ఉంది. అది మీ ద్వారా నెరవేరినందుకు అనిల్ రావిపూడి గారికి దన్యవాదాలు. నామీద నమ్మకంతో ప్రతి సినిమా నాకు ఇస్తున్న మహేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఎవరు ఊహించని విధంగా పెర్ఫామ్ చేశారు. మైండ్ బ్లాక్ సాంగ్ అదరగొట్టారు. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ సుంకర గారికి, దిల్ రాజు గారికి నా కృతజ్ఞతలు” అన్నారు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ – “నాకు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి, అనిల్ రావిపూడి గారికి, అలాగే అనిల్ సుంకర, దిల్ రాజు గారికి ధన్యవాదాలు“అన్నారు.

నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూస్తున్నాను!!
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనం. మహర్షి సక్సెస్ మీట్లో అన్నాను.. మ‌హేశ్ సర్ నా సినిమాతో మీ మోహంలో నవ్వు కావాలి, మిమ్మల్ని ఆనందంగా చూడాలి అని. సినిమా విడుదలైనప్పటి నుండి ఆయనతోనే ఉంటున్నాను. ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఇంత పెద్ద ఫంక్షన్ ని ఏర్పాటు చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషన్స్ కి నా హృదయపూర్వక దన్యవాదాలు. విజయశాంతి గారిది వరంగల్. ఆమె మా ఒప్పుకొని నటించినందుకు ధన్యవాదాలు. బాబు బ్యాటింగ్ మొదలయింది. మొదటి వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్ తెచ్చారు. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారో తెలీదు. ఇది నాకు ఐదవ సినిమా ప్రతి సినిమా హిట్ చేశారు. మీ వల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూస్తున్నాను. అదేకాదు ఈ కథ విన్నప్పుడు మహేశ్ గారికి ఉన్న నమ్మకం, షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆయనకున్న కాన్ఫిడెన్స్, డబ్బింగ్ జరిగాక ఆయనకున్న ప్రిడిక్షన్, సినిమా విడుదలైన మొదటి రోజు ఆయనిచ్చిన జడ్జి మెంట్ అన్ని నిజమయ్యాయి. మ‌హేశ్ గారు మీ క్లారిటీకి, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ ఏ బౌ..మా నిర్మాతలు దిల్ రాజు గారితో ఐదవ సినిమా. థాంక్స్ మీట్ లో కనివిని ఎరుగని రీతిలో బాక్స్ ఆఫీస్ రెవెన్యూ చూడబోతున్నారు అని చెప్పారు. అలాగే ఇచ్చారు. ఇక అనిల్ సుంకర గారు మొదటి రోజు ఒక మాట అన్నారు మా బాబు కి బ్లాక్ బస్టర్ స‌రిపోదు బ్లాక్ బస్టర్
కా బాప్ కావాలని. అలాగే జరిగింది. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిన ప్రతి హీరోకి నా కృతజ్ఞతలు. నాకు తెలిసిన సినిమా ఒకటే నా ప్రొడ్యూసర్ గల్లాలో డబ్బులు, ప్రేక్షకుల ఫేస్ లో నవ్వులు. నాకు తెలిసిన స్టేట్ మెంట్ ఇదే. దాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి దన్యవాదాలు” అన్నారు.

మన ఓరుగల్లు..సరిలేరు సినిమాకి ప్రజలు అందిస్తున్న ఓరుజల్లు!!
లేడీ అమితాబ్ విజయశాంతి మాట్లాడుతూ – “మన ఓరుగల్లు..సరిలేరు సినిమాకి ప్రజలు నీరాజనం అందిస్తున్న ఓరుజల్లు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్ గా నిలిపిన మీఅందరికి నా శిరసువంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 13 ఏళ్లకు ముందు మీ రాములమ్మ, మీ బిడ్డని ఏ రకంగా ఆదరించారో.. ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లారో..నేను ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలో తెలీట్లేదు. 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు అనే మంచి సినిమా నాదగ్గరికి రావడానికి ముఖ్య కారణం అనిల్ రావిపూడి. కథ విన్నాను నచ్చింది.. చేశా.. హిట్ కొట్టాం అని తెలియజేసుకుంటున్నాను. భారతి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచి పోయింది. సైనికుల తల్లి తండ్రుల భాద ఏంటి అనేది అనిల్ చక్కగా, సందేశాత్మకంగా చూపించారు.సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ‘కొడుకు దిద్దన కాపురం’ సినిమాలో కలిసి నటించాను అది సూపర్ హిట్. ఇప్పడు `సరిలేరు నీకెవ్వరు` లో కలిసి నటించాను ఇది సూపర్ డూపర్ హిట్. బాబు తో పని చేయడం చాలా కంఫర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. ఇంకా సినిమాలు చేయి రాములక్క అని అందరూ అడుగుతున్నారు. మీ అందరికి తెలుసు సబ్జెక్ట్ బాగుండాలి..పాత్ర దద్దరిల్లాలి అలాగైతేనే ఈ రాములక్క చేస్తుంది. ఎందుకంటే సినిమా ఒకటే కాదు రాజకీయం కూడా ఉంది. నేను ప్రజల మనిషిని ప్రజలకోసమే పనిచేస్తాను. మీరెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను“ అన్నారు.

మీ ప్రేమ‌కు, అప్యాయ‌త‌కు, మీ అభిమానానికి టేక్ ఎ బౌ!!
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మాట్లాడుతూ – “అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో గొప్ప డైలాగ్స్ రాశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ర‌మ‌ణ లోడ్ ఎత్తాలిరా.. అనే డైలాగ్ మాత్రం బీభ‌త్సంగా పేలింది. ఈరోజు స్వామి వారి ద‌ర్శ‌నం త‌ర్వాత వరంగ‌ల్‌కి వ‌చ్చి ప్రేక్ష‌కుల‌కు క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంది. మా డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ 7 రోజుల్లో రూ.100 కోట్లు సాధించింద‌నే విష‌యాన్ని చెబుతూ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. వారికి ఈ వేదిక‌పై థ్యాంక్స్ చెబుతున్నాను. యాక్ష‌న్ కంపోజ్ చేసిన రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్‌కి, సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలుగారికి, ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్ర‌సాద్‌కి థ్యాంక్స్‌. క‌థ విన‌గానే, మాస్ సాంగ్ చేయ‌డానికి ఛాన్స్ ఉంద‌ని అప్పుడే దేవిశ్రీ చెప్పాడు. అలా వ‌చ్చిందే మైండ్ బ్లాక్ సాంగ్‌. అలాగే శేఖ‌ర్ మాస్ట‌ర్ అద్భుతంగా ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు. నా 20 ఏళ్ళ‌ కెరీర్‌లో ఇంత రెస్పాన్స్‌ను ఎప్పుడు ఎక్స్‌పీరియ‌న్స్ చేయ‌లేదు. శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దేవిశ్రీ , అనిల్ రావిపూడికి థ్యాంక్స్‌. విజ‌య‌శాంతిగారితో `కొడుకు దిద్దిన కాపురం` చిత్రానికి ప‌నిచేశాను. త‌ర్వాత ఆవిడ‌తో థ‌ర్టీ ఇయ‌ర్స్ త‌ర్వాత ప‌నిచేసే అవ‌కాశం ఈ సినిమాకే క‌లిగింది. ఆవిడను క‌లిసిన‌ప్పుడు `కొడుకు దిద్దిన కాపురం` నిన్నే చేసిన‌ట్లు అనిపించింది. `కొడుకు దిద్దిన కాపురం` పెద్ద హిట్టు.. `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమెతో ప‌నిచేయ‌డం మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌. మ‌ళ్లీ ఆవిడతో క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్నాను. ర‌ష్మిక స్వీటెస్ట్ కోస్టార్‌. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారితో ప‌నిచేయడం అమేజింగ్‌గా అనిపించింది. `సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు`, `మ‌హ‌ర్షి` చిత్రాల త‌ర్వాత దిల్‌రాజుగారితో ఈ సినిమాకు ప‌నిచేయడం చాలా గొప్ప‌గా ఉంది. హ్యాట్రిక్ హిట్ సాధించాం. దిల్‌రాజుగారు కేవలం నిర్మాత మాత్ర‌మే కాదు.. మంచి డిస్ట్రిబ్యూట‌ర్ కూడా. సినిమాను ప్రేక్ష‌కుల‌కు ఎలా రీచ్ చేయించాలో బాగా తెలిసిన నిర్మాత‌. ఆయ‌న‌తో క‌లిసి మ‌రో హ్యాట్రిక్ ఇవ్వ‌బోతున్నాం. ఇక నిర్మాత అనిల్ సుంక‌ర విష‌యానికి వ‌స్తే .. అంద‌రి కంటే ఆయ‌న పెద్ద అభిమాని. ఈరోజు ఆయ‌న కోరిక తీరినందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో జ‌ర్నీ ఇలాగే కొన‌సాగాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డైరెక్ట‌ర్ అనిల్ .. త‌ను ముందు 40 నిమిషాల నేరేష‌న్ మాత్ర‌మే ఇచ్చాడు. త‌న‌లో ఎన‌ర్జీ చూసి ఇది ముందు చేయ‌డానికి కుదురుతుందా? అన‌గానే మొత్తం స్క్రిప్ట్‌ను రెండు నెల‌ల్లోనే సిద్ధం చేసి ఇచ్చాడు. దానికి కారణం నాన్న‌గారి,నా అభిమానులే. నాలుగైదేళ్లుగా అంద‌రూ కొత్త మ‌హేష్ కోరుకుంటున్నార‌ని తెలుసు. కంటెంట్ బేస్డ్‌ సినిమాలు, వేరే జోన‌ర్ సినిమాలు చేశాను. సినిమా చేసేట‌ప్పుడు అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. ప్రేక్ష‌కులు, అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌ను ఎంచుకున్నాను. నా కెరీర్‌లో నేను తీసుకున్న బెస్ట్ డిసిష‌న్ ఇదేన‌ని ఫీల్ అవుతున్నాను. నాన్న‌గారి అభిమానులు, నా అభిమానుల త‌రపున అనిల్‌కి థ్యాంక్స్‌. వారి కోరిక‌ను తీర్చాను. ఈ సంక్రాంతిని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోను. ప్రేక్ష‌కుల అభిమానుల అభిమానం వ‌ల్లే ఇలా దొరికింది. మీ ప్రేమ‌కు, అప్యాయ‌త‌కు, మీ అభిమానానికి టేక్ ఎ బౌ.. థ్యాంక్యూ“ అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు బాబు,కౌముది, రచ్చ రవి, అజయ్, చిట్టి, చిత్ర‌ డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Images:


గిరిజన గ్రామాల డిజిటలీకరణకు హీరో ఆదిత్య ఓం చేయూత


గిరిజన గ్రామాల డిజిటలీకరణకు హీరో ఆదిత్య ఓం చేయూత
సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే హీరో ఆదిత్య ఓం భద్రాచలం పరిధిలోని చెరుపల్లి, కొత్తపల్లి,
కొత్తపల్లి, కోయనరసాపురం గ్రామాల డిజిటలీకరణకు శ్రీకారం చుట్టారు. పేస్‌ గ్రూప్‌కి చెందిన ‘టి.సేన’తో ఒప్పందం కుదుర్చుకొని గిరిజన గ్రామ యువతకు శిక్షణ ఇచ్చి ఈ ఆన్‌లైన్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. సినీ నిర్మాత, దర్శకులు విజయ్‌వర్మ పాకాలపాటి సహకారంతో కోయనరసాపురం గ్రామానికి చెందిన రామకృష్ణకి శిక్షణ ఇచ్చి సంక్రాంతి సందర్భంగా ఆ గ్రామంలో ‘టి.సేవ’ కేంద్రాన్ని ప్రారంభించారు. మిగతా గ్రామాలలో అతి త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా చెరుపల్లి పరిసర గ్రామాల వృద్ధులకు రగ్గులను, యువతకు క్రికెట్‌ కిట్‌లను అందించారు. అలాగే చెరుపల్లి స్కూల్‌కి కొన్ని బెంచీలను సమకూర్చుతున్నారు. ఈ కార్యక్రమాలను తన సన్నిహితుడు విజయ్‌వర్మ పాకాలపాటి చేతుమీదుగా చేయిస్తున్నట్టు వివరించారు హీరో ఆదిత్య ఓం.

Related Images:


రెబల్ స్టార్ కృష్ణంరాజు బర్త్ డే సెలబ్రేషన్

దాదాపు 350కిపైగా చిత్రాల్లో నటించి.. సినీప్రియుల మదిలో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకోవడమే కాక, నిర్మాతగానూ పదుల సంఖ్యలో హిట్‌ చిత్రాలు నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఈనెల 20న ఆయన జన్మదినం. ఆయన 80వ పుట్టిన రోజుని పురస్కరించుకుని రెండు రోజుల ముందుగానే శనివారం హైదరాబాద్‌ ఎఫ్ ఎన్ సి సి లో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బర్త్ డే సెలబ్రేషన్ జరిగాయి. సతీసమేతంగా హాజరైన కృష్ణంరాజు కేక్ కట్ చేసి తన ఆనందాన్నిపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రభూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా..

రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘సినీ జర్నలిస్టు విశ్లేషణ నటీనటుల భవిష్యత్తు, ఎదుగుదలకి ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి ఎందరో గొప్ప జర్నలిస్టు నాకు మంచి అనుబంధం ఉంది. అందరికీ ఏదో ఒక వ్యసనం ఉంటుంది. నాకు స్నేహితులను చేసుకునే వ్యసనంఉంది. ఫ్రెండ్స్ ని చూసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది. మా నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్‌కు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ ఉంది. ఆ బేనర్ లో
అనేక గొప్ప సినిమాలను నిర్మించి, నటించాను. ‘బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి’, ‘అమర దీపం’, ‘మనవూరి పాండవులు’ వంటి చిత్రాలు చేశా ‘తాండ్రపాపారాయుడు’ చిత్ర సమయంలో ఐదువేల మందితో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించాం. క్లిష్ట పరిస్థితుల్లో అంత మందితో చిత్రీకరించడంతో నా బలం, నాలోని శక్తి ఏంటో తెలిసింది. అది చూసి ఎంతో ఆనంద పడ్డాను. మా సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలుంటాయి. ఇప్పుడు మా నుంచి రాబోతున్న ప్రభాస్‌ కొత్త చిత్రాన్ని ఈ అంచనాలకు తగ్గట్లుగానే రూపొందిస్తున్నాం. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. ఇప్పటికే యూరోప్‌లో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. మరో మూడు నెలల పాటు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో విదేశాల్లో చిత్రీకరణకు వెళ్తాం. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాం. గురువును మించిన శిష్యుడు.. తండ్రిని మించిన తనయుడు.. అంటుంటారు కదా. ప్రభాస్‌ కూడా అలాంటి వాడే. నేను హీరోగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సీమల్లో గుర్తింపు తెచ్చుకున్నా. కానీ, ప్రభాస్‌ ఏకంగా దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని, అభిమాన గణాన్ని సృష్టించుకున్నాడు.నేనూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రనుl పోషిస్తున్నా..ప్రతి తండ్రి తన కొడుకు ఎదగాలని కోరుకుంటాడు.. తప్ప తన తనయుడి చేతిలో ఓడిపోవాలని కోరుకోరు. నేనూ అంతే. ఈ కృష్ణంరాజు ఎప్పుడూ ఓటమిని అంగీకరించడు (నవ్వుతూ). ఎందుకంటే ఓటమన్నది నా జీవితంలోనే లేదు. ఇక రాజకీయాల విషయానికొస్తే.. ఇప్పటికైతే రాజకీయంగా నాకంటూ సొంత ఉద్దేశాలు లేవు. పార్టీ పెరిగితే నేను పెరిగినట్లే. వాజ్‌పేయి ప్రభుత్వం హీరోగా ఉన్న నన్ను కేబినెట్‌ మంత్రిని చేసింది. వాళ్లు నాకిచ్చిన ఈ గౌరవాన్ని నేనూ నిలబెట్టుకున్నా. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ భాజపాతో పొత్తు పెట్టుకోవడాన్ని స్వాగతిస్తున్నా. ఇది శుభపరిణామం. సిద్ధాంతాలు కలుపుకోని ప్రజలకు సేవ చేయాలని అనుకున్నంత కాలం ఐదు కోట్ల మంది ఆంధ్రులకు అంతా మంచే జరుగుతుంది’’ అన్నారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కృష్ణంరాజుని ప్రత్యేకంగా సత్కరించింది. అసోసియేషన్‌కి తమ వంతు సహకారం అందిస్తామని కృష్ణంరాజు హామీ ఇచ్చారు.

Related Images:


రాజ్‌తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌, కె.కె.రాధామోహన్‌ ల ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ షూటింగ్ పూర్తి. ఏప్రిల్ 3న విడుదల

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ”మా ఒరేయ్ బుజ్జిగా షూటింగ్ పూర్తయింది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దర్శకులు కొండా విజయ్‌కుమార్‌గారు డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. తప్పకుండా మా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Related Images:


విష్ణు మంచు , సునీల్ శెట్టి మ‌ధ్య హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో `మోస‌గాళ్ళు` భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌

విష్ణు మంచు క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `మోస‌గాళ్ళు`. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విష్ణు మంచు, సునీల్ శెట్టి మ‌ధ్య భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ఇప్పుడు చిత్రీక‌రిస్తున్నారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ఆధ్వ‌ర్యంలో.. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో ఈ యాక్ష‌న్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా నిపుణుల‌ పర్యవేక్ష‌ణ‌లో ఈ యాక్ష‌న్ పార్ట్‌ను మాస్ట‌ర్ పీస్‌లా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.
ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు తెర‌పై రాన‌టువంటి విధంగా ఈ యాక్ష‌న్ సీన్ ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఈ స‌న్నివేశం కోసం ఇద్ద‌రు స్టార్స్ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను కూడా తీసుకుంటున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:
విష్ణు మంచు , సునీల్ శెట్టి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రూహి సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌: విష్ణు మంచు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ కుమార్‌.ఆర్‌
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్ కుమార్‌.ఎం

Related Images:


‘మిస్టర్ అండ్ మిస్’ఫస్ట్ లుక్ పోస్టర్

తెలుగు కథ, కథనాలు రేయాలిస్టిక్ కథల వైపు పరుగులు పెడుతున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలలో సహజత్వం ముందు ఉంటుంది. అలాంటి కథే “మిస్టర్ అండ్ మిస్” డేటింగ్ లు, వీడియో చాటింగ్ లు ప్రేమ లో భాగం అయిన ఈ జన రేషన్ ప్రేమ కథ గా “మిస్టర్ అండ్ మిస్” రూపొందింది.

తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే
కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా
ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్
సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో
తెరకెక్కించబోతున్నాడు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడతూ:

” ఇది ఈ జనరేషన్ ప్రేమ కథ, ఒక ఇండిపెండెంట్ అమ్మాయి కథ, హీరో క్యారెక్టర్ తో నేటి యువతరం బాగా రిలెట్ అవుతుంది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతి లివింగ్ రిలేషన్ లో ఉంటారు. ఈ కథ లో ఈ జంట లో ఒకరి మైబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..? యూత్ రిలేట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ మూవీ లుక్ ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్.

“మిస్టర్ అండ్ మిస్” టీం రిలీజ్ చేసిన ఈ లుక్ కి మంచి స్పందన వస్తుంది. .
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనులలో ఉన్న
ఈ చిత్రంలో జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్నారు.
పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ మూవీగా వస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్
కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి,కాస్ట్యూమ్ డిజైనర్ : సహస్ర రెడ్డి, ఆర్ట్
డైరెక్టర్ : కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి,
సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ :
జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల,
నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.

Related Images:


యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా చూసి చూడంగానే అందరికి నచ్చుతుంది – రాజ్ కందుకూరి. జనవరి 31న గ్రాండ్ రిలీజ్

‘పెళ్ళిచూపులు’, ‘మెంట‌ల్ మ‌దిలో’ వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాత‌గా, ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న తొలి చిత్రానికి ‘చూసీ చూడంగానే`. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావు ద‌ర్శకురాలిగా ప‌రిచ‌యం కానుంది. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ….

మీడియా మిత్రలకు నమస్కారం. జనవరి 31న సురేష్ ప్రొడక్షన్ ద్వారా చూసి చూడంగానే విడుదల కానుంది. నేను యంగ్ ట్యాలెంట్ తో సినిమాలు చెయ్యడానికి ఇష్టపడతాను. అలా ఒక యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా చూసి చూడంగానే. ఈ చిత్రానికి మా అబ్బాయి శివ కందుకూరి అయితే బాగుంటుందని డైరెక్టర్ శేష నాకు చెప్పడంతో శివను ఈ సినిమాతో పరిచయం చేశాను. ఈ మూవీ చాలా సహజంగా ఉంటుంది, మధురా ఆడియో ద్వారా ఈ చిత్ర పాటలను విడుదల చేస్తున్నాము. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లాభిస్తోంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం మరింత హైలెట్ కానుంది. నన్ను ఎప్పుడూ సుపోర్టు చేసే మీడియా ఈ మూవీకి మరింత సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

శివ కందుకూరి మాట్లాడుతూ….
సినిమా చెయ్యలను డిసైడ్ అయినప్పటినుండి అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. శేష సింధు రావు ఈ సినిమా స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడే బాగా నచ్చింది. నాకోసం ఒక మంచి స్క్రిప్ట్ రాసినందుకు థాంక్స్. యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా ఇది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ మూవీకి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్ కు స్పెషల్ థాంక్స్. నాన్న రాజ్ కందుకూరి గారు నన్ను నమ్మి నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, థాంక్స్ టు హిమ్. మా సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ….
రాజ్ కందుకూరి గారు చిన్న సినిమాలకు ఎక్కువ ప్రోత్సహం ఇస్తున్నారు. ఆయన నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. హీరోగా పరిచయం అవుతున్న శివ కందుకూరికి ఇది బెస్ట్ సబ్జెక్ట్. గోపిసుందర్ ఈ మూవీకి అందించిన పాటలు పాపులర్ అయ్యాయి. జనవరి 31న విడుదల కాబోతున్న ఈ చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

డైరెక్టర్ శేష సింధు మాట్లాడుతూ…
నేను ఈ సినిమా కోసం ఈగల్ గా ఎదురు చూస్తున్నాను. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శివ కందుకూరి గారికి థాంక్స్. శివ కందుకూరికి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. హీరోయిన్ వర్ష ఈ సినిమాలో బాగా యాక్ట్ చేసింది, షూటింగ్ పూర్తి అయ్యేలోపు తను తెలుగు నేర్చుకుంది. డైలాగ్స్ రాసిన పద్మకు స్పెషల్ థాంక్స్, ఇతర టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్ అందరికి ప్రేత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

హీరోయిన్ వర్ష మాట్లాడుతూ…
నేను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ఇది. నాకు షూటింగ్ సమయంలో సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. శివ కందుకూరి గారు నన్ను నమ్మి ఈ రోల్ ఇచ్చారు. శివ కందుకూరి అనుభవం కలిగిన హీరోల నటించాడు. డైరెక్టర్ శేష సింధు మంచి స్క్రిప్ట్ తో మన ముందుకు వస్తున్నారు. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను బ్లస్ చెయ్యండని తెలిపారు.

హీరోయిన్ మాళవిక మాట్లాడుతూ…
చూసి చూడంగానే మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్, డైరెక్టర్ శేష సింధు గారు రాసుకున్న పాయింట్ ను అందంగా స్క్రీన్ పై చూపించారు. తెలుగులో నాకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇస్తుందని నముతున్నాను, మా సినిమాను మీ అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

Related Images:


మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ నుండి మూడో పాట రమ్ పమ్ బమ్ విడుదల !!!

మాస్ మహా రాజ ర‌వితేజ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఫేమ్‌ నభా నటేశ్, పాయల్‌ రాజ్‌పుత్‌ లు తాన్యా హోప్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటింస్తున్న ఈ సినిమాకి స్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాలోని మూడో పాట హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశంలో విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో వి.ఐ. ఆనంద్, సునీల్, నభ నటేష్, తమన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు విఐ. ఆనంద్ మాట్లాడుతూ….
డిస్కో రాజా అనే సినిమా ఆడియన్స్ కొత్త అనుభూతిని ఇస్తుంది. రవితేజ గారి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. తమన్ అందించిన సాంగ్స్ ఈ మధ్య పాపులర్ అయ్యాయి, అలాగే మా సినిమా కోసం తమన్ మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. రమ్ పమ్ బమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.

తమన్ మాట్లాడుతూ….
రమ్ పమ్ బమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకున్నాను, ఇప్పుడు సాంగ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, గుడ్ రెస్పాన్స్ లభిస్తోంది, ఇదంతా చూస్తుంటే కష్టం మర్చిపోయాను. డిస్కో రాజా సినిమాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ఢిల్లీవాలా, నువ్వు నాతో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించిందన్నారు.

సునీల్ మాట్లాడుతూ…
రవితేజ గారితో నేను కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమా ఇది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనంద్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీశాడు, ఆడియన్స్ కు ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ మూవీలా ఉంటుంది అన్నారు.

నభ నటేష్ మాట్లాడుతూ…
రవితేజ గారితో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి, ఈ సినిమాలో నా పాత్ర పేరు నభ, మీ అందరికి నచ్చుతుంది. ఢిల్లీ వాలా సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్ లో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి. జనవరి 24న విడుదల కానున్న డిస్కో రాజా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరారు.

Related Images:


షూటింగ్ పూర్తి చేసుకున్న”సముద్రుడు”

కీర్తన ప్రొడక్షన్స్ పతాకం ఫై బదావత్ కిషన్ నిర్మాత గా నగేష్ నారదాసి దర్శకత్వంలో నిర్మిస్తున్న “సముద్రుడు” చిత్రం నిరాటంకంగా 25 రోజులపాటు చీరాల ఓడరేవు సముద్ర తీరంలో రెండవ షెడ్యూల్ ముగించింది.3 పాటలు మినహా పూర్తి షూటింగ్ ముగిసిందని.అతి త్వరలో పాటలు ఫారిన్ లో చిత్రికరణ జరుగుతుందని దర్శకుడు నగేష్ నారదాసి తెలిపారు.చీరాల ప్రజలు చూడటానికి వెల్లువలా తరలివచ్చిన అక్కడి ప్రజలు కానీ పోలీస్ వ్యవస్థ గాని,ex ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ గారు తదితర పెద్దలు సంపూర్ణంగా సహకరించారని.చిత్రం ఆధ్యంతం అనుకున్నదానికంటే అద్భుతంగా వచ్చిందని నిర్మాత తెలిపారు.మత్సకారుల బ్యాక్ డ్రాప్ లో పూర్తి కమర్షియల్ హంగులతో చిత్రికరణ జరిగిందని తెలిపారు.ఈ చిత్రానికి శ్రీ రామోజు జ్ఞానేశ్వర్,సోములు,రామారావు లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో రమాకాంత్ హీరోగా భాను శ్రీ (బిగ్ బాస్),అవంతిక లు హీరోయిన్లుగా నటిస్తుండగా సుమన్,రామరాజు,సుమన్ శెట్టి,సమ్మెట గాంధీ,(జూనియర్) రాజశేఖర్,చిత్రంశ్రీను, శ్రావణ్,జబర్దస్త్ శేషు,రాజ ప్రేమి,తేజ రెడ్డి,దిల్ రమేష్,డానియెల్,మల్లేష్,ప్రభావతి,గణేష్,కిషోర్,సిరిరాజ్ తదితరులు నటిస్తున్నారు.సంగీతం:సుభాష్ ఆనంద్,కెమెరా:వాసు,ఫైట్స్:సతీష్,నందు,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,డాన్స్:అనీష్,ఎడిటింగ్:బుల్ రెడ్డి,నిర్మాత:బదావత్ కిషన్,కధ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:నగేష్ నారదాసి.

Related Images:


‘క్షీర సాగర మథనం’

‘క్షీర సాగర మథనం’
హీరోయిన్ అక్షత సోనావని
ఫస్ట్ లుక్ విడుదల చేసిన పాయల్

దేవతలు-రాక్షసులు సాగరాన్ని మధించినప్పుడు అమృతంతోపాటు హాలాహలమూ వచ్చింది. మన మనసులు మధించినప్పుడు కూడా మంచి ఆలోచనలతోపాటు, చెడు ఆలోచనలు కూడా ఉద్భవిస్తాయి. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని బహుముఖ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను అత్యద్భుతంగా తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేయగా- యువ కథానాయకుడు అడివి శేష్ ‘క్షీరసాగరమథనం’ పోస్టర్ ను లాంచ్ చేశారు. తాజాగా చిత్ర కథానాయకి అక్షత సోనావని ఫస్ట్ లుక్ సంచలన కథానాయకి పాయల్ రాజ్ పుట్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపింది.

శేఖర్ కమ్ముల మొదలుకుని గౌతమ్ తిన్ననూరి వంటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ టర్న్ డ్ ఫేమస్ డైరెక్టర్స్ కోవలో సినిమా రంగంలో తనదైన ముద్ర వేయాలనే వజ్ర సంకల్పం కలిగిన ఐ.టి.రంగ నిపుణులు ‘అనిల్ పంగులూరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గుండెల్నిమెలిపెట్టే గాఢమైన అనుభూతుల్ని పంచి.. పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసి.. చాలా రోజుల తరువాత మరో మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందిస్తున్నామనే నమ్మకం, గర్వం మాకుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
చరిష్మా శ్రీకర్, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న

ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

Related Images: