Category Archives: Latest Reviews

విష్ణు మంచు , సునీల్ శెట్టి మ‌ధ్య హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో `మోస‌గాళ్ళు` భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌

విష్ణు మంచు క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `మోస‌గాళ్ళు`. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విష్ణు మంచు, సునీల్ శెట్టి మ‌ధ్య భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ఇప్పుడు చిత్రీక‌రిస్తున్నారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ఆధ్వ‌ర్యంలో.. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో ఈ యాక్ష‌న్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా నిపుణుల‌ పర్యవేక్ష‌ణ‌లో ఈ యాక్ష‌న్ పార్ట్‌ను మాస్ట‌ర్ పీస్‌లా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.
ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు తెర‌పై రాన‌టువంటి విధంగా ఈ యాక్ష‌న్ సీన్ ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఈ స‌న్నివేశం కోసం ఇద్ద‌రు స్టార్స్ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను కూడా తీసుకుంటున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:
విష్ణు మంచు , సునీల్ శెట్టి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రూహి సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌: విష్ణు మంచు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ కుమార్‌.ఆర్‌
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్ కుమార్‌.ఎం

Related Images:


‘మిస్టర్ అండ్ మిస్’ఫస్ట్ లుక్ పోస్టర్

తెలుగు కథ, కథనాలు రేయాలిస్టిక్ కథల వైపు పరుగులు పెడుతున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలలో సహజత్వం ముందు ఉంటుంది. అలాంటి కథే “మిస్టర్ అండ్ మిస్” డేటింగ్ లు, వీడియో చాటింగ్ లు ప్రేమ లో భాగం అయిన ఈ జన రేషన్ ప్రేమ కథ గా “మిస్టర్ అండ్ మిస్” రూపొందింది.

తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే
కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా
ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్
సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో
తెరకెక్కించబోతున్నాడు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడతూ:

” ఇది ఈ జనరేషన్ ప్రేమ కథ, ఒక ఇండిపెండెంట్ అమ్మాయి కథ, హీరో క్యారెక్టర్ తో నేటి యువతరం బాగా రిలెట్ అవుతుంది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతి లివింగ్ రిలేషన్ లో ఉంటారు. ఈ కథ లో ఈ జంట లో ఒకరి మైబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..? యూత్ రిలేట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ మూవీ లుక్ ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్.

“మిస్టర్ అండ్ మిస్” టీం రిలీజ్ చేసిన ఈ లుక్ కి మంచి స్పందన వస్తుంది. .
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనులలో ఉన్న
ఈ చిత్రంలో జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్నారు.
పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ మూవీగా వస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్
కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి,కాస్ట్యూమ్ డిజైనర్ : సహస్ర రెడ్డి, ఆర్ట్
డైరెక్టర్ : కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి,
సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ :
జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల,
నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.

Related Images:


యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా చూసి చూడంగానే అందరికి నచ్చుతుంది – రాజ్ కందుకూరి. జనవరి 31న గ్రాండ్ రిలీజ్

‘పెళ్ళిచూపులు’, ‘మెంట‌ల్ మ‌దిలో’ వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాత‌గా, ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న తొలి చిత్రానికి ‘చూసీ చూడంగానే`. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావు ద‌ర్శకురాలిగా ప‌రిచ‌యం కానుంది. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ….

మీడియా మిత్రలకు నమస్కారం. జనవరి 31న సురేష్ ప్రొడక్షన్ ద్వారా చూసి చూడంగానే విడుదల కానుంది. నేను యంగ్ ట్యాలెంట్ తో సినిమాలు చెయ్యడానికి ఇష్టపడతాను. అలా ఒక యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా చూసి చూడంగానే. ఈ చిత్రానికి మా అబ్బాయి శివ కందుకూరి అయితే బాగుంటుందని డైరెక్టర్ శేష నాకు చెప్పడంతో శివను ఈ సినిమాతో పరిచయం చేశాను. ఈ మూవీ చాలా సహజంగా ఉంటుంది, మధురా ఆడియో ద్వారా ఈ చిత్ర పాటలను విడుదల చేస్తున్నాము. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లాభిస్తోంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం మరింత హైలెట్ కానుంది. నన్ను ఎప్పుడూ సుపోర్టు చేసే మీడియా ఈ మూవీకి మరింత సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

శివ కందుకూరి మాట్లాడుతూ….
సినిమా చెయ్యలను డిసైడ్ అయినప్పటినుండి అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. శేష సింధు రావు ఈ సినిమా స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడే బాగా నచ్చింది. నాకోసం ఒక మంచి స్క్రిప్ట్ రాసినందుకు థాంక్స్. యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా ఇది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ మూవీకి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్ కు స్పెషల్ థాంక్స్. నాన్న రాజ్ కందుకూరి గారు నన్ను నమ్మి నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, థాంక్స్ టు హిమ్. మా సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ….
రాజ్ కందుకూరి గారు చిన్న సినిమాలకు ఎక్కువ ప్రోత్సహం ఇస్తున్నారు. ఆయన నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. హీరోగా పరిచయం అవుతున్న శివ కందుకూరికి ఇది బెస్ట్ సబ్జెక్ట్. గోపిసుందర్ ఈ మూవీకి అందించిన పాటలు పాపులర్ అయ్యాయి. జనవరి 31న విడుదల కాబోతున్న ఈ చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

డైరెక్టర్ శేష సింధు మాట్లాడుతూ…
నేను ఈ సినిమా కోసం ఈగల్ గా ఎదురు చూస్తున్నాను. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శివ కందుకూరి గారికి థాంక్స్. శివ కందుకూరికి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. హీరోయిన్ వర్ష ఈ సినిమాలో బాగా యాక్ట్ చేసింది, షూటింగ్ పూర్తి అయ్యేలోపు తను తెలుగు నేర్చుకుంది. డైలాగ్స్ రాసిన పద్మకు స్పెషల్ థాంక్స్, ఇతర టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్ అందరికి ప్రేత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

హీరోయిన్ వర్ష మాట్లాడుతూ…
నేను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ఇది. నాకు షూటింగ్ సమయంలో సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. శివ కందుకూరి గారు నన్ను నమ్మి ఈ రోల్ ఇచ్చారు. శివ కందుకూరి అనుభవం కలిగిన హీరోల నటించాడు. డైరెక్టర్ శేష సింధు మంచి స్క్రిప్ట్ తో మన ముందుకు వస్తున్నారు. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను బ్లస్ చెయ్యండని తెలిపారు.

హీరోయిన్ మాళవిక మాట్లాడుతూ…
చూసి చూడంగానే మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్, డైరెక్టర్ శేష సింధు గారు రాసుకున్న పాయింట్ ను అందంగా స్క్రీన్ పై చూపించారు. తెలుగులో నాకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇస్తుందని నముతున్నాను, మా సినిమాను మీ అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

Related Images:


మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ నుండి మూడో పాట రమ్ పమ్ బమ్ విడుదల !!!

మాస్ మహా రాజ ర‌వితేజ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఫేమ్‌ నభా నటేశ్, పాయల్‌ రాజ్‌పుత్‌ లు తాన్యా హోప్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటింస్తున్న ఈ సినిమాకి స్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాలోని మూడో పాట హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశంలో విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో వి.ఐ. ఆనంద్, సునీల్, నభ నటేష్, తమన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు విఐ. ఆనంద్ మాట్లాడుతూ….
డిస్కో రాజా అనే సినిమా ఆడియన్స్ కొత్త అనుభూతిని ఇస్తుంది. రవితేజ గారి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. తమన్ అందించిన సాంగ్స్ ఈ మధ్య పాపులర్ అయ్యాయి, అలాగే మా సినిమా కోసం తమన్ మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. రమ్ పమ్ బమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.

తమన్ మాట్లాడుతూ….
రమ్ పమ్ బమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకున్నాను, ఇప్పుడు సాంగ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, గుడ్ రెస్పాన్స్ లభిస్తోంది, ఇదంతా చూస్తుంటే కష్టం మర్చిపోయాను. డిస్కో రాజా సినిమాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ఢిల్లీవాలా, నువ్వు నాతో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించిందన్నారు.

సునీల్ మాట్లాడుతూ…
రవితేజ గారితో నేను కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమా ఇది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనంద్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీశాడు, ఆడియన్స్ కు ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ మూవీలా ఉంటుంది అన్నారు.

నభ నటేష్ మాట్లాడుతూ…
రవితేజ గారితో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి, ఈ సినిమాలో నా పాత్ర పేరు నభ, మీ అందరికి నచ్చుతుంది. ఢిల్లీ వాలా సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్ లో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి. జనవరి 24న విడుదల కానున్న డిస్కో రాజా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరారు.

Related Images:


నాన్ బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో !!!

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురం లో సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ , డాన్స్ , యాక్షన్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోసారి త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్, స్టొరీ, స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. విడుదలైన అన్ని చోట్లా పాజిటీవ్ టాక్ తో దూసుకెళుతోంది.

అల వైకుంఠపురంలో సినిమా నైజాం, వైజాగ్ , కృష్ణ , వెస్ట్ , సీడెడ్ , గుంటూరు , నెల్లూరు వంటి ఏరియాల్లో నాన్ బాహబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. 3వ రోజు షేర్ కి 8 ఏరియాలు, 4వ రోజు షేర్ కి
7 ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం విశేషం. ఓవర్సీస్ లో విడుదలైన చిత్రాల్లో అల వైకుంఠపురంలో నెంబర్ 1 స్థానంలో దూసుకెళుతోంది, ఈ శుక్రవానికి 2 మిలియన్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండక్కి విడుదలైన చిత్రాల్లో టికెట్స్ దొరకడం లేదని పబ్లిక్ అనుకుంటున్నారు. సంక్రాంతి సినిమాల్లో టిక్కెట్లు దొరకనంతగా హౌస్ ఫుల్స్ అవ్వడం అల వైకుంఠపురం చిత్రానికే సాధ్యం అయ్యింది.

Related Images:


షూటింగ్ పూర్తి చేసుకున్న”సముద్రుడు”

కీర్తన ప్రొడక్షన్స్ పతాకం ఫై బదావత్ కిషన్ నిర్మాత గా నగేష్ నారదాసి దర్శకత్వంలో నిర్మిస్తున్న “సముద్రుడు” చిత్రం నిరాటంకంగా 25 రోజులపాటు చీరాల ఓడరేవు సముద్ర తీరంలో రెండవ షెడ్యూల్ ముగించింది.3 పాటలు మినహా పూర్తి షూటింగ్ ముగిసిందని.అతి త్వరలో పాటలు ఫారిన్ లో చిత్రికరణ జరుగుతుందని దర్శకుడు నగేష్ నారదాసి తెలిపారు.చీరాల ప్రజలు చూడటానికి వెల్లువలా తరలివచ్చిన అక్కడి ప్రజలు కానీ పోలీస్ వ్యవస్థ గాని,ex ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ గారు తదితర పెద్దలు సంపూర్ణంగా సహకరించారని.చిత్రం ఆధ్యంతం అనుకున్నదానికంటే అద్భుతంగా వచ్చిందని నిర్మాత తెలిపారు.మత్సకారుల బ్యాక్ డ్రాప్ లో పూర్తి కమర్షియల్ హంగులతో చిత్రికరణ జరిగిందని తెలిపారు.ఈ చిత్రానికి శ్రీ రామోజు జ్ఞానేశ్వర్,సోములు,రామారావు లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో రమాకాంత్ హీరోగా భాను శ్రీ (బిగ్ బాస్),అవంతిక లు హీరోయిన్లుగా నటిస్తుండగా సుమన్,రామరాజు,సుమన్ శెట్టి,సమ్మెట గాంధీ,(జూనియర్) రాజశేఖర్,చిత్రంశ్రీను, శ్రావణ్,జబర్దస్త్ శేషు,రాజ ప్రేమి,తేజ రెడ్డి,దిల్ రమేష్,డానియెల్,మల్లేష్,ప్రభావతి,గణేష్,కిషోర్,సిరిరాజ్ తదితరులు నటిస్తున్నారు.సంగీతం:సుభాష్ ఆనంద్,కెమెరా:వాసు,ఫైట్స్:సతీష్,నందు,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,డాన్స్:అనీష్,ఎడిటింగ్:బుల్ రెడ్డి,నిర్మాత:బదావత్ కిషన్,కధ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:నగేష్ నారదాసి.

Related Images:


వ‌రంగ‌ల్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్

వ‌రంగ‌ల్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్‌ను శ‌నివారం సాయంత్ర 5 గంట‌ల‌కు వ‌రంగ‌ల్ హ‌న్మ‌కొండ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు స్టేడియంలో నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌ల్లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటున్నారు.

Related Images:


బొంబాట్‌లో `ఇష్క్ కియా…` సాంగ్‌ను విడుద‌ల చేసిన మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

క‌ళ్ల‌లోన దాచినానులే.. రెప్ప‌దాటి పోలేవులే
కాటుకైన పెట్ట‌నులే.. నీకు అంటుకుంటుంద‌ని
పెద‌వికే తెల‌ప‌ని ప‌లికె నీ పేరునే ప్రియ‌త‌మా.. ఓ ప్రియ‌త‌మా
లోక‌మే ఆన‌దు మైక‌మే వీడ‌దు.. తెలుసునా ఇది ప్రేమేన‌ని
ఎందుకిలా ఓ ఎందుకిలా….. ఇష్క్ కియా అంటూ త‌న ప్రేమ‌ను హీరోయిన్ హీరోకు వ్య‌క్తం చేస్తే ఎలా ఉంటుంది? ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందం చూసేయాలంటే `బొంబాట్‌` సినిమా చూసేయాల్సిందే.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తోన్న‌ చిత్రం `బొంబాట్`. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు. పాట విన‌డానికి అహ్లాదంగా ఉంద‌ని చిత్ర యూనిట్‌ను త‌మ‌న్ అభినందించారు.

రామాంజ‌నేయులు రాసిన ఈ పాట‌ను సునీతా సార‌థి శ్రావ్యంగా ఆల‌పించారు. హీరో సుశాంత్‌, సిమ్రాన్ మ‌ధ్య సాగే ల‌వ్ మెలోడీ ఇది. లిరిక‌ల్ వీడియోలో చూపించిన కొన్ని విజువ‌ల్స్ క్యూట్‌గా అనిపిస్తున్నాయి. ప్రేయ‌సి త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను ప్రేమికుడికి ఎంత అందంగా చెప్పింద‌నే స‌న్నివేశంలో వ‌చ్చే పాట ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంటున్నారు.
రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు సినిమాను తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Related Images:


మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ సెకండ్ టీజర్ విడుదల !!!

మాస్ మహా రాజ ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కో రాజా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటింస్తున్న ఈ సినిమాకి స్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల విడుదలైన డిస్కో రాజా సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్ర కొత్త టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. రవితేజ డైనమిక్ గా కనిపిస్తున్న ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. జనవరి 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయబోతున్నారు. జనవరి 24 న డిస్కో రాజా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Related Images:


తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక ఇచ్చిన జీ 5

జనవరి 13,2020 హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ భాషలలో అధిక వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న జీ5 . సంక్రాంతి పండుగ సందర్భంగా త్వరలో తెలుగు ప్రజల ముందుకు తీసుకురానున్న నాలుగు వెబ్ సిరీస్ వివరాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు.

జీ5 గతంలో విడుదల చేసిన గాడ్,హై ప్రిస్టిస్, కైలాసపురం,Mrs.సుబ్బలక్ష్మి,నర్డ్,హవాలా, బీటెక్,ఎక్కడికి ఈ పరుగు, వాట్సాప్ పనిమనిషి , చిత్ర విచిత్రం ,నాన్న కూచి వంటి వినూత్నమైన వెబ్ సిరీస్ లను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు జీ5 ప్రోగ్రామింగ్ హెడ్ అపర్ణ అచరేకర్ కృతజ్ఞతలు తెలిపారు. తమ వద్దకు ఎవరైనా మంచి కథతో వస్తే తమను తప్పక ఎంకరేజ్ చేస్తామని అన్నారు.2020 ప్రథమ భాగంలో రానున్న తమ వెబ్ సిరీస్ ల గురించి తెలిపారు.

చదరంగం : ఒక పొలిటికల్ డ్రామా. తన ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల లోకి వచ్చిన ఒక నటుడు.తన లక్ష్యం కోసం ఏం చేశాడు అన్నది ఈ చదరంగం కథ. ఈ సిరీస్ కు రాజ్ అనంత దర్శకత్వం వహించారు.ఇందులో శ్రీకాంత్, సునైన,నాగినీడు ముఖ్య పాత్రలలో నటించారు.మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు.చదరంగం ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానున్నది.

లూసర్ : ఒక స్పోర్ట్స్ డ్రామా.ఇందులో క్రికెటర్,బ్యాడ్మింటన్ ప్లేయర్,రైఫిల్ షూటర్ అవ్వాలి అనుకునే ముగ్గురు వ్యక్తులు ఆటలలో ఉండే రాజకీయాల వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలను ఎదురుకున్నారో అన్నది ఈ లూసర్ కథ.ఇందులో ప్రియదర్శి, కల్పిక, షియాజి షిండే, శశాంక్ ముఖ్య పాత్రలలో నటించారు. లూసర్ కు అభిలాష్ రెడీ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు దీన్ని నిర్మించారు.లూసర్ మార్చి లో ప్రేక్షకుల ముందుకి రానున్నది.

ఎక్స్పైరీ డేట్ : ఇది తెలుగు,హిందీ బైలింగ్వల్ క్రైమ్ థ్రిల్లర్.తనను మోసం చేసినందుకు భర్త భార్యను ఏం చేశాడో అన్నది ఎక్స్పైరీ డేట్ కథ. స్నేహ ఉల్లాల్, మధు శాలిని, టోనీ లుక్, అలీ రెజ్జ ముఖ్య పాత్రలలో నటించారు.ఎక్స్పైరీ డేట్ కు శంకర్ మార్తాండ దర్శకత్వం వహించారు. శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.ఎక్స్పైరీ డేట్ జూన్ లో ప్రేక్షకుల ముందుకి రానున్నది.

అమృతం ద్వితీయం : నవ్వుల ఆణిముత్యం మైన అమృతం మరోసారి సీక్వెల్ తో మన ముందుకు వస్తున్నది. గత అమృతం లో భాగమైన హర్షవర్ధన్, శివ నారాయణ ,వాసు ఇంటూరి లతో ఎల్బీ శ్రీరామ్, సత్య కృష్ణ మనల్ని నవ్వించడానికి చేతులు కలిపారు. ఈ ద్వితీయ భాగం కి గంగరాజు కలం పట్టగా, సందీప్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గంగరాజు , సందీప్ సంయుక్తంగా లైట్ బాక్స్ మీడియా బ్యానర్ లో ఈ ఉగాదికి అంటే 25 మార్చి న నవ్వించడానికి జీ5 ఉన్న వారి ఇంటికి వస్తున్నారు.

Related Images: