ఓటీటీలోకి సత్యదేవ్ ‘స్కైలాబ్’.. ఎప్పటి నుంచి అంటే…
Category : Behind the Scenes OTT OTT Latest Movies Sliders

సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ‘స్కైలాబ్’. 1979లో అంతరిక్ష పరిశోధనా శాల నుంచి ‘స్కైలాబ్’ భూమిపై పడనుందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగిన కథగా ఈ కామెడీ సినిమా తెరకెక్కింది. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. బ్రైట్ ఫీచర్స్, నిత్యామీనన్ సొంత నిర్మాణ సంస్థ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఇప్పుడీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్గా ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయింది. ఈ నెల 14న సంక్రాంతి కానుకగా ‘స్కైలాబ్’ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఆ మేరకు సోనీ లివ్ సంస్థ ట్విట్టర్ లో ప్రకటించారు. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.