టక్‌ జగదీష్‌ రివ్యూ

చిత్రం: టక్‌ జగదీష్‌; నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, డానియల్‌ బాలాజీ, నరేశ్‌, రావు రమేశ్, ప్రవీణ్‌ తదితరులు

సంగీతం: తమన్‌, గోపీ సుందర్‌(నేపథ్య సంగీతం)

బ్యానర్‌: షైన్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌

నిర్మాత: సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

తనదైన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు నాని. తొలి సినిమా నుంచే వైవిధ్య కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారాయన. కరోనా కారణంగా గతేడాది ఆయన నటించిన ‘వి’ ఓటీటీలో సందడి చేసింది. పరిస్థితులు ఇంకా మెరుగుపడక పోవడంతో తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘టక్‌ జగదీష్‌’ కూడా అదే బాటలో పయనించింది. ‘నిన్నుకోరి’ వంటి సూపర్‌హిట్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? నాని తన నటనతో మరోసారి మెప్పించారా?.. లేదా? తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం..

కథేంటంటే..

భూదేవీపురం గ్రామంలో ఆదికేశ‌వ నాయుడు(నాజ‌ర్‌) పెద్దమ‌నిషి. తన కుటుంబంతో పాటు ఊరిలో అంద‌రూ బావుండాల‌ని కోరుకుంటాడు. అదికేశవ నాయుడికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బోసు(జ‌గ‌ప‌తిబాబు).. చిన్న కొడుకు జ‌గ‌దీష్ నాయుడు(నాని). జగదీష్ ఎప్పుడూ టక్ చేసుకునే ఉంటాడు. దీంతో అందరూ అతడికి టక్ జగదీష్ అని పిలుస్తుంటారు. త‌న ట‌క్‌ను ఎవ‌రైనా లాగితే వారితో గొడ‌వ ప‌డుతుంటాడు. బోసు ఊళ్లో వ్యవ‌హారాలు చూసుకుంటుంటే, ట‌క్ జ‌గ‌దీష్ సిటీలో ఉంటూ అప్పుడ‌ప్పుడూ ఊరికి వ‌చ్చి వెళుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వీరేంద్ర నాయుడు(డానియ‌ల్ బాలాజీ) తండ్రి ఊర్లో గొడ‌వ‌లు పెడుతూ ఉంటాడు. ఓసారి అనుకోకుండా వీరేంద్ర నాయుడు తండ్రిని ఓ వ్యక్తి పంచాయ‌తీలోనే చంపేస్తాడు. దాంతో వీరేంద్ర నాయుడు ఆది కేశ‌వులు, అత‌ని కుటుంబంపై ప‌గ పెంచుకుంటాడు. అనుకోకుండా ఓ రోజు ఆది కేశ‌వ‌నాయుడు గుండెపోటుతో చ‌నిపోతాడు. అప్పుడు బోసు త‌న అసలు రంగు చూపిస్తాడు. వీరేంద్రతో చేతులు క‌లిపి.. ఎమ్మార్వో సాయంతో ఆస్థిని త‌న పేరుపై ఉండేలా చూసుకుంటాడు. అంతే కాదు.. త‌న ఇంటి ఆడ‌ప‌డుచుల‌కు ఆస్థి ఇవ్వన‌ని అంద‌రినీ ఇంటి నుంచి గెంటేస్తాడు. అస‌లు బోసు ఉన్నట్లుండి అలా ఎందుకు మారిపోయాడు? నిజం తెలుసుకున్న జ‌గ‌దీష్ అన్నను ఎలా దారిలోకి తెచ్చుకుంటాడు? వీరేంద్రతో చేతులు క‌లిపిన బోసుకి ఎలాంటి పరిస్థితి ఎదుర‌వుతుంది? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

గ్రామంలో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న కొడుకైన హీరో వాటిని ఎలా పరిష్కరించాడన్న కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. మంచి పాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ పండినవేళ ఆయా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. విక్టరీ వెంకటేశ్‌ ఇలాంటి సబ్జెక్ట్‌తో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్‌లు అందుకున్నారు. ‘టక్‌ జగదీష్‌’ విషయంలో దర్శకుడు శివ నిర్వాణ కథానాయకుడి పాత్ర మినహా కొత్త కథ జోలికి పోలేదు. భూదేవిపురంలో జరిగే గొడవలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆయా సన్నివేశాలన్నీ గతంలో మనం చాలా సినిమాల్లో చూశాం. టక్‌ జగదీష్‌ రాకతో కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు నడిపించాడు. కథనం కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఆది శేషులునాయుడు చనిపోయే వరకూ ఫక్తు ఫ్యామిలీ డ్రామా తెరపై కనిపిస్తూ ఉంటుంది.

ఆ త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు పాత్ర.. విల‌న్‌తో చేతులు క‌ల‌ప‌డం.. ఫ్యామిలీలో గొడ‌వ‌లు మొద‌లు ఇలా క‌థ నెక్ట్స్ స్టెప్ తీసుకుంటుంది. ఇక నాని.. పాత్రకు సంబంధించిన ఎమ్మార్వో అనే అస‌లు బ్యాక్ డ్రాప్‌ను బ‌య‌ట‌ పెట్టడంతో ఇంట‌ర్వెల్‌ను పూర్తి చేశారు. ఇక సెకండాఫ్‌లో ఎమ్మార్వోగా ఊల్లోకి రాగానే అన్న‌కు ఎదురు తిర‌గ‌డం.. విల‌న్ భ‌ర‌తం ప‌ట్ట‌డం వంటి స‌న్నివేశాలతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయ‌త్నం చేశారు. ఊరు, కుటుంబం బావుండాల‌నుకున్న తండ్రి మాట‌ను నిల‌బెట్టడానికి అందరితో చెడ్డవాడిన‌నిపించుకున్న హీరో..చివ‌ర‌కు త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డంతో సినిమా ముగుస్తుంది. ఇందులోని చాలా సెంటిమెంట్ సన్నివేశాలు చూస్తుంటే కార్తి నటించిన ‘చినబాబు’ గుర్తుస్తొంటుంది.

ఎవరెలా చేశారంటే..

ఎలాంటి పాత్ర అయినా తనదైన నటన, హావభావాలతో ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలనని ‘టక్‌ జగదీష్‌’తో నాని మరోసారి నిరూపించాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఆయనకు తిరుగులేదు. యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టాడు. అయితే, నాని నుంచి కోరుకునే చిలిపి కామెడీ ఇందులో లేదు. దర్శకుడు దాన్ని కూడా దృష్టి పెట్టుకుని ఉంటే ఈ సినిమా మరోస్థాయిలో ఉంటుంది. రీతూవర్మ అందంగా కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేసింది. నాని-రీతూల కెమిస్ట్రీ తెరపై బాగుంది. జగపతిబాబు సీనియార్టీ బోసు పాత్రకు బాగా పనికొచ్చింది. ఆ పాత్రలో ఉన్న రెండు రకాల వేరియేషన్స్‌ చక్కగా పలికించారు. ఐశ్వర్య రాజేశ్‌, డానియల్‌ బాలాజీ, నాజర్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

Related Images:


వినాయక వ్రతకథ.. చవితి రోజున చంద్రుడిని చూస్తే ఎందుకు అరిష్టం?

భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే వినాయక చవితి నాడు పూజతో పాటు వ్రత కథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చవితి రోజున వ్రతకథ వింటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.

కథా ప్రారంభం…
తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది.

అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు.. ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు.. గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.

శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

ఋషి పత్నులకు నీలాపనిందలు
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు. ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి.. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.

Related Images:


భక్తుల కోర్కెలు తీర్చే దైవం.. అయినవిల్లి సిద్ధి వినాయకుడు

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా..

అంటూ కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే గణనాథుడిని స్తుతిస్తుంది భక్తలోకం. విఘ్నాలు తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక సుప్రసిద్ధ వినాయక ఆలయాలున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న పుణ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. పార్వతీ తనయుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు.

స్థల పురాణం
కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం ద్వారా తెలుస్తోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామంలో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకున్ని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.

క్షేత్ర ప్రత్యేకత
అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్‌ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. దీంతో గ్రామంలో దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం.

ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్‌ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష పెన్నులు సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం.


ఇలా చేరుకోవచ్చు:
అయినవిల్లి రాజమహేంద్రవరానికి 60 కిలోమీటర్లు, అమలాపురానికి 12కిలోమీటర్లు దూరం ఉంది. రాజమహేంద్రవరం నుంచి వచ్చేవారు రావులపాలెం చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అమలాపురం నుంచి వచ్చేవారు ముక్తేశ్వరం చేరుకుని అక్కడి నుంచి ఆటోలో అయినవిల్లి చేరుకోవచ్చు. రైలు, విమాన మార్గాల ద్వారా వచ్చేవారు రాజమహేంద్రవరంలో దిగి అక్కడికి నుంచి రోడ్డుమార్గంలో అయినవిల్లి చేరుకోవచ్చు.

Related Images:


Don’t miss: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలివే!

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడిన నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు క్యూ కడుతున్నాయి. అయితే కరోనాపై జనాల్లో ఇంకా భయం ఉండటంతో థియేటర్లకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ ప్రభావం కలెక్షన్లపై బాగా పడుతోంది. కొన్ని సినిమాలు ధైర్యంగా థియేటర్‌కు వచ్చేందుకు మొగ్గు చూపుతుంటే, మరికొన్ని ఇప్పటికీ ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే గత నెల రోజులతో పోలిస్తే ఈ వారం అటు థియేటర్‌తో ఓటీటీలోనూ సందడి రెట్టింపు కానుంది. వినాయకచవితిని పురస్కరించుకుని ఓటీటీ ద్వారా రీజల్ అవుతున్న సినిమాల వివరాలు మీకోసం..

10న నాని ‘టక్‌ జగదీష్‌’
నాని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్‌, కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ‘నిన్నుకోరి’ తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్య పరిణామాల కారణంగా ఓటీటీ బాటపట్టింది. భూ కక్షలు లేని భూదేవిపురం కోసం ‘టక్‌ జగదీష్‌’ యువకుడు ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌, రోహిణి కీలకపాత్రలు పోషించారు.

ఆ ‘నెట్‌’లో పడితే ఇక అంతేనా?

రాహుల్‌ రామకృష్ణ, అవికా గోర్‌తో కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నెట్‌’. భార్గవ్‌ మాచర్ల దర్శకుడు. సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో లక్ష్మణ్‌ అనే పాత్రలో రాహుల్‌ రామకృష్ణ కనిపించనున్నారు. అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించారు. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్‌ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్‌ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్‌ లైఫ్‌ని వీక్షించిన రాహుల్‌ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? తెలియాలంటే ‘నెట్‌’ చూడాల్సిందే.

మెడికల్‌ థ్రిల్లర్‌ ముంబై డైరీస్‌ 26/11
అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా మరో కొత్త సిరీస్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘ముంబై డైరీస్‌ 26/11’ పేరుతో తెరకెక్కిన ఈ మెడికల్‌ థ్రిల్లర్‌ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మోహిత్‌ రైనా, కొంకణ సేన్‌ శర్మ, శ్రేయా ధన్వంతరిలు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను నిఖిల్‌ అడ్వాణీ, నిఖిల్‌ గోన్సల్వేస్‌లు తెరకెక్కించారు. మొత్తం ఎనిమిది భాగాల్లో ఈ సిరీస్‌ ప్రసారం కానుంది. 26/11 ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్‌ ఫోర్స్‌ ఏవిధంగా పనిచేసిందన్న ఆసక్తికర అంశాలను థ్రిల్‌ కలిగించేలా సిరీస్‌ను తీర్చిదిద్దారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘తుగ్లక్‌ దర్బార్‌’

సెప్టెంబరు 9న ‘లాభం’ చిత్రంతో థియేటర్‌లో సందడి చేయనున్న విజయ్‌ సేతుపతి ఆ మరుసటి రోజే వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న టెలివిజన్‌లో అలరించనున్నారు. ఆయన కీలక పాత్రలో తెరకెక్కిన తమిళ పొలిటికల్‌ మూవీ ‘తుగ్లక్‌ దర్బార్‌’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్‌ కథానాయికలు. దిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సెప్టెంబరు 10న సన్‌ టీవీ నేరుగా ప్రసారం చేయనుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌ చేయనుంది. ఓ రాజకీయ నాయకుడ్ని అమితంగా ఇష్టపడే సింగారవేలన్‌ (విజయ్‌ సేతుపతి) అనే యువకుడి పాత్రలో విజయ్‌ సేతుపతి అలరించనున్నారు.

ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు

Amazon Prime Video

  • లూలా రిచ్‌ (సెప్టెంబర్‌ 10)

Aha

  • ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ ( సెప్టెంబర్‌ 10)
  • మహాగణేశా ( సెప్టెంబర్‌ 10)

Disney Plus Hotstar

  • అమెరికన్‌ క్రైమ్‌స్టోరీ (సెప్టెంబర్‌ 08)

Netflix

  • అన్‌టోల్డ్‌: బ్రేకింగ్‌ పాయింట్‌ (సెప్టెంబర్‌ 07)
  • ఇన్‌ టు ది నైట్‌ (సెప్టెంబర్‌ 08)
  • బ్లడ్‌ బ్రదర్స్‌ (సెప్టెంబర్‌ 09)
  • మెటల్‌ షాప్‌ మాస్టర్స్‌ (సెప్టెంబర్‌ 10)
  • లూసిఫర్‌ (సెప్టెంబర్‌ 10)
  • కేట్‌ (సెప్టెంబర్‌ 10)

ZEE 5

  • డిక్కీ లూనా (సెప్టెంబర్‌ 10)
  • క్యా మేరీ సోనమ్‌ గుప్తా బెవాఫా హై (సెప్టెంబర్‌ 10)

Voot

  • క్యాండీ (సెప్టెంబర్‌ 08)

Related Images:


Bigg Boss Telugu 5: వామ్మో.. నాగార్జునకు అంత రెమ్యునరేషనా?

తెలుగు ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ వినోదాన్ని పంచేందుకు బగ్‌బాస్ ఐదో సీజన్ మొదలైపోయింది. బిగ్‌బాస్‌ రియాలిటీ షోను రసవత్తరంగా నడిపించడంలో హోస్ట్‌దే కీలకపాత్ర. అవసరమైన చోట కంటెస్టెంట్లను ఎంకరేజ్‌ చేస్తూ, అతి చేసిన చోట చురకలంటించడం, ఆడియన్స్‌ నాడికి తగ్గట్లుగా కంటెస్టెంట్లతో గేమ్స్‌ కూడా ఆడిస్తుంటాడు హోస్ట్. ఈ క్రమంలో ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే రీతిలో మాట్లాడుతూ వారిని అలరిస్తుంటాడు.

అందుకే బిగ్‌బాస్‌ మొదలవుతుందనగానే కంటెస్టెంట్ల కన్నా ముందు హోస్ట్‌ ఎవరన్నదానిపై ఎక్కువగా చర్చ నడుస్తుంది. తొలి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్టింగ్ చేయగా.. మూడు, నాలుగు సీజన్లను కింగ్ నాగార్జున రసవత్తరంగా నిర్వహించారు. ఐదో సీజన్‌కు కూడా ఆయనే హోస్టింగ్ చేస్తున్నారు. అయితే గత సీజన్ల కంటే ఈ సారి ఆయన పారితోషికాన్ని భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

106 రోజులపాటు కొనసాగనున్న ఐదో సీజన్‌కు నాగార్జున రూ.12 కోట్ల మేర పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు తీసుకున్న నాగ్‌ ఈసారి మాత్రం భారీ రేంజ్‌లో డబ్బులు డిమాండ్‌ చేస్తుండటం షాక్‌కు గురిచేస్తోంది. నాగార్జున హోస్టింగ్‌ను ప్రేక్షకులు ఇష్టపడటంతో ఐదో సీజన్‌ కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్న షో నిర్వాహకులు ఆయన ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఏకంగా రూ.12కోట్లు ఇవ్వడానికి రెడీ అయినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Related Images:


One – Mammootty’s Telugu-dubbed Film On Aha

Category : OTT Reviews

Release date: July 30, 2021

Rating: 2.75/5

Starring: Mammootty

Director: Santhosh Viswanath

Producer: Sreelakshmi. R

DOP : Vaidy Somasundaram

Music Director: Gopi Sundar

Editor: Nishadh Yusuf

The Telugu dubbed version of Malayali superstar Mammootty’s political thriller, One is streaming on Aha Video. Here is our review of the film.

Story:

A social media post from an enraged teenager kicks off a political turmoil, which goes on to cause unrest to the chief minister of Telangana, Kalluri Chandram (Mammootty). What does the chief minister do to pacify the situation? How can a simple post on social media lead to political turmoil? Watch the film to know the answers.

Plus Points: There is no debating the fact that Mammootty is one of the very best actors in Indian cinema. He oozes class in every frame and his composed performance propels the entire narrative.

The storyline might seem farcical at first, but the way it has been justified is impressive. The film is a raw take on modern-day politics, albeit in a dramatized manner.

Minus Points:

The scenes related to the internal conflict within the chief minister’s party are way too typical. These sequences go on for at least 30 minutes and they have zero freshness. A better subplot should have been incorporated to make things more intriguing and engaging.

The ending portion is a bit cliched and it is easily predictable. The viewer can easily guess what is about to happen in the last 20 minutes of the film. The film gets a happy ending, but a more imaginative closure would have worked very well for the film.

Technical Aspect:

Santhosh Vishwanath picks a novel subject but his narrative is predictable on more occasions than one. But he does manage to hold the attention of the viewers for most parts. Gopi Sundar’s background score is a big asset to the film. His protagonist-elevating BGM is of top-tier quality. The cinematography is excellent.

Verdict:

One is a moderately gripping political thriller that has a rather unique plot. But the screenplay and narrative is predictable at times. Mammootty stands out with his winning performance. You can give the film a watch if you a tad too much spare time.

Related Images:


Kailasapuram

Category : OTT OTT Web Series

Release Date05 June 2021
LanguageTelugu
GenreThriller
PlatformZee5
DirectorBhargav Macharla

Related Images:


Nizhal

Category : OTT OTT Latest Movies

Release Date23 Jul 2021
CategoryFilm
GenreThriller
LanguageMalayalam, Telugu
PlatformAha, Amazon prime
DirectorAppu N.Bhattathiri

Related Images:


Narappa

Category : OTT OTT Latest Movies

Release Date20 Jul 2021
CategoryFilm
GenreAction Drama
LanguageTelugu
PlatformAmazon prime
Director Srikanth Addala

Related Images:


Bhuj: The Pride of India

Category : OTT OTT Latest Movies

Release Date13 Aug 2021
CategoryFilm
GenreAction Drama
LanguageHindi
PlatformHotstar

Related Images: