Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
చిరంజీవితో విభేదాలు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
చిరంజీవి – అల్లు అరవింద్ ఒకరికొకరు ఎలా గౌరవంగా మెలుగుతారో సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా తెలిసిందే. అయితే మెగా-అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయంటూ తరుచూ వార్తలొస్తూనే ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను వారు ఖండిస్తూనే ఉన్నా పుకార్లు మాత్రం ఆగవు. ఇదే అంశంపై అల్లు అరవింద్ మరోసారి స్పందించారు.
తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ మాట్లాడుతూ.. ‘‘సమాజంలో ఇలాంటి మాటలు సహజం. అయితే 80ల కాలం నుంచి మేమిద్దరం ఒకరికొకరు అన్నట్లు స్నేహితులుగా ఉంటూ పైకొచ్చాం. బావబావమరుదులుగా కాకుండా మంచి స్నేహితులుగా ఎదిగాం. మేం ఎదుగుతున్న తరుణంలో మా కుటుంబాలు పెరిగాయి. పిల్లలు వచ్చారు. వారు కూడా ఇదే వృత్తిలో స్థిరపడ్డారు. ఫిల్మ్ సొసైటీలో ఉన్న అవకాశాలను అందరూ పంచుకోవాలి. ఎవరి స్థానాలను వారు కాపాడుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పోటీ అనేది సహజంగా ఉంటుంది. అయితే ఇక్కడ జనాలు ఒకటి గమనించాలి. వీళ్లందరూ ఒక్కటే. ఎవరి మీద ఏ మాట పడినా అందరూ ఒక మాట మీద ఉంటారు అన్నది జనాలకు తెలియడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇటీవల నాన్నగారి శత జయంతి ఉత్సవాలను మా కుటుంబాలన్నీ కలిసి నిర్వహించాం. సంక్రాంతి పండుగ రోజు మా నాన్నగారికి చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి చిరంజీవిగారి ఇంటికి వెళ్లిపోతాం. దీపావళి రోజున అందరం కలిసి చిరంజీవిగారింట్లో చేరి సరదాగా సెలబ్రేట్ చేసుకుంటాం. కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. మేమంతా కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకుంటున్నామని వీడియోలు తీసే మీడియా పెడతామా? పెట్టం కదా! ఎవరి కాంపిటీషన్తో వాళ్లు పైకి వస్తున్నారు కానీ వీరంతా ఒకటే అని జనాలు తెలుసుకోవాలి’’ అని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.
‘ఓ సన్నివేశంలో నటించడం కష్టమై 10 టేకులు తీసుకోవడం వల్ల దర్శకుడు విసుక్కున్నారని నాన్న అమ్మతో చెబుతుంటే విన్నాను. అప్పుడు నాన్న కళ్లల్లో నీళ్లు చూశా. ఆ సంఘటన బలంగా నాటుకుపోయింది. కొన్నాళ్ల తర్వాత బలవంతం మీద చిరంజీవి నటించిన ‘చంటబ్బాయ్’లో ఓ పాత్ర చేశా. దానికి చక్కని ఆదరణ లభించింది. ఆ సినిమా విడుదల తర్వాత ‘నిర్మాతగా ఉంటే డబ్బులు వస్తాయో రావో తెలియదు. అదే నటిస్తే ఆ సమస్య ఉండదు. యాక్టర్ అవ్వచ్చు కదా’’ అని ఓ రోజు నాన్న అడిగారు. మరుసటి రోజు ఆయన దగ్గరకు వెళ్లి ‘నేను ఎప్పుడూ యజమానిగా ఉండాలనుకుంటున్నా.. కానీ, ఉద్యోగి కావాలనుకోలేదు’ అని చెప్పాను. నాన్నకు తెలిసిన మంత్రి ద్వారా స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే రూ.900 జీతం. నేను వ్యాపారమే చేస్తాను కానీ ఉద్యోగం జోలికి వెళ్లనని చెప్పేశా’ అని అరవింద్ చెప్పుకొచ్చారు.
చిరంజీవి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకే కాదు.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ ఆసక్తి ఉంటుంది. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ఈ ఏడాది ‘ఆచార్య’ కాస్త గట్టిగానే షాక్ ఇచ్చింది. అయితే, ఈ దసరాకు ‘గాడ్ఫాదర్’గా తనదైన వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. మరోవైపు లూసిఫర్ మలయాళంలో చాలా పెద్ద హిట్ మూవీ. మోహన్లాల్కి ఉన్న చరిష్మాను మరో రేంజ్లో ఎలివేట్ చేసింది. పృథ్విరాజ్ కెరీర్లో డైరక్టర్గా గోల్డెన్ ఫిల్మ్. తెలుగులోనూ అనువాదమై ఓటీటీల్లో అందుబాటులో ఉంది. అన్నా చెల్లెలు, ఓ రాష్ట్రం సీఎం, ఫ్యామిలీ ఇబ్బందులు, పొలిటికల్ ఇష్యూస్.. స్థూలంగా ఇదే కథాంశం. ఇదే కథను తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఎలా తెరకెక్కించారు? కింగ్ మేకర్గా చిరు మెప్పించారా?.. మాతృకతో పోలిస్తే ఏవి మెరుగ్గా ఉన్నాయి?.. సల్మాన్, నయన్, సత్యదేవ్ పాత్రలు అదనపు ఆకర్షణ తెచ్చాయా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం..
రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.రామదాసు (పీకేఆర్) మరణం తర్వాత రాజకీయ శూన్యం ఏర్పడుతుంది. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై జన జాగృతి పార్టీ (జేజేపీ) తర్జనభర్జన పడుతుంటుంది. పీకేఆర్ స్థానంలో అధికారాన్ని హస్తగతం చేసుకుని సీఎం కావాలని అతడి అల్లుడు జైదేవ్ (సత్యదేవ్) భావిస్తాడు. అందుకు పార్టీలోని కొందరు దురాశపరులతో చేతులు కలుపుతాడు. అయితే, పీకేఆర్కు అత్యంత సన్నిహితుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు బ్రహ్మ తేజ (చిరంజీవి) మాత్రం జైదేవ్ సీఎం కాకుండా అడ్డు నిలబడతాడు. దీంతో జన జాగృతి పార్టీ నుంచి, అసలు ఈ లోకం నుంచే బ్రహ్మను పంపించడానికి జైదేవ్ కుట్రలు పన్నుతాడు. మరి ఆ కుట్రలను బ్రహ్మ ఎలా ఎదుర్కొన్నాడు? జైదేవ్ నీచుడన్న విషయం జైదేవ్ భార్య సత్యప్రియ (నయనతార)కు ఎలా తెలిసింది? రాష్ట్ర పాలన దురాశపరుల చేతిలో పడకుండా బ్రహ్మ ఎలా అడ్డుకున్నాడు? ఇంతకీ బ్రహ్మకు, పీకేఆర్కు ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో మసూద్ భాయ్ (సల్మాన్) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మలయాళ సినిమా లూసిఫర్ను దాదాపు తెలుగు ప్రేక్షకులందరూ చూశారు. ఆ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్గా రీమేక్ చేయటమేంటని ముందు చాలా మంది భావించారు. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఆ అభిప్రాయం తప్పకుండా మార్చుకోవాల్సిందే. సినిమా ప్రధాన కథాంశం అదే తీసుకున్నారు. కొన్ని మెయిన్ సీన్స్ కూడా అదే స్టైల్లోనే చిత్రీకరించారు. కానీ కథలో చేయాల్సిన ప్రధాన మార్పులన్నింటినీ చక్కగా చేశారు. మన తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేశారు. అలాగే చిరంజీవి హీరోయిజాన్ని అభిమానులే కాదు.. ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించారు దర్శకుడు మోహన్ రాజా. లూసిఫర్ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం గాడ్ ఫాదర్ను చూస్తే కొత్తగా ఉన్నట్లు భావన కలిగింది.
‘‘గాడ్ ఫాదర్’ స్క్రీన్ప్లే కొత్తగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఇవన్నీ సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఓపిక ఉంటే ‘లూసిఫర్’ని మరోసారి చూసి రండి’’ – ఇదీ ఇటీవల ఇంటర్వ్యూలో దర్శకుడు మోహన్రాజా చెప్పిన విషయం. తన స్క్రీన్ప్లే, మార్పులపై ఎంత నమ్మకంతో చెప్పారో దాన్నే తెరపై చూపించడంలో విజయం సాధించారు దర్శకుడు. ‘లూసిఫర్’ చూసిన వాళ్లు కూడా ‘గాడ్ఫాదర్’ను ఎంజాయ్ చేస్తారు. పీకేఆర్ మరణంతో సినిమా మొదలు పెట్టిన దర్శకుడు, కొద్దిసేపటికే అసలు కథేంటి? సినిమాలో పాత్రల తీరుతెన్నులు వివరంగా చెప్పేశారు. ఇక ప్రేక్షకుడు చూడాల్సింది తెరపై కనిపించే రాజకీయ చదరంగమే. ఈ చదరంగంలో రెండు బలమైన పావులుగా ఒకవైపు బ్రహ్మగా చిరంజీవి, జైదేవ్గా సత్యదేవ్లు నిలబడ్డారు. ఒక్కో సన్నివేశంలో ఒక్కొక్కరిది పై చేయి ఉంటుంది. అయితే, బ్రహ్మ పాత్ర కీలకం కావడంతో అంతర్లీనంగా అతడే ఒక మెట్టుపైన ఉంటాడు. చిరంజీవి కనిపించే ప్రతి సన్నివేశమూ ఆయన్ను ఎలివేట్ చేసిన విధానం స్టైలిష్గా బాగుంది. ఆ సన్నివేశాలకు తమన్ నేపథ్యం సంగీతం థియేటర్ను ఊపేసింది.
లూసిఫర్ తో పోలిక పక్కనపెట్టి ఈ సినిమా వరకు చర్చించుకుంటే చిరంజీవి ఆద్యంతం హుందాగా కనిపిస్తూ వయసుకు తగ్గట్టు కనిపించారు. అయితే ఆయన్నుంచి ఆశించే నామమాత్రపు డ్యాన్సు కూడా ఇందులో లేదు. చివర్లో వచ్చే తార్ మార్ టక్కర్ మార్ లో కూడా సరైన స్టెప్పు ఒక్కటి కూడా వేయలేదు. పైగా దానికి ప్రభుదేవా కోరియోగ్రఫీ. ఎంత చిరంజీవి వయసుని దృష్టిలో పెట్టుకున్నా ఆయననుంచి కనీసం ఖైది 150లో షూలేస్ స్టెప్పులాంటిదైనా ఆయన ఫ్యాన్స్ ఆశించడం సహజం. అది పెద్దగా శ్రమలేని స్టెప్పే. ఆ విషయంలో మాత్రం పూర్తిగా నిరాశ కలిగినట్టే. అసలు తార్ మార్ పాట పెట్టి ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ సినిమాకు నీరవ్షా కెమెరా హైలైట్. మోహన్రాజా పల్స్ పట్టుకుని ప్రతి షాట్నీ ఎలివేట్ చేశారు తమన్. తమన్ మ్యూజిక్కి స్పెషల్ అప్లాజ్ వస్తుంది. అలాగే తప్పక మెన్షన్ చేయాల్సిన మరో పేరు లక్ష్మీభూపాల్. ప్రతి మాటనూ శ్రద్ధగా రాశారు. ఆయా కేరక్టర్ల బిహేవియర్ని, బాడీ లాంగ్వేజ్నీ బట్టి ఆయన రాసిన మాటలు మెప్పిస్తాయి. పూరి జగన్నాథ్ కేరక్టర్ స్పెషల్ అట్రాక్షన్. సునీల్, షఫి, దివి, గంగవ్వ, బ్రహ్మాజీ, సముద్రఖని,భరత్రెడ్డి, అనసూయ.. ఇలా ప్రతి పాత్రకూ స్క్రీన్ మీద న్యాయం చేశారు డైరక్టర్.
కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే RRR, ప్రభాస్ రాధేశ్యామ్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ బాటలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీని వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న రిలీజ్ కావాల్సిన ఆచార్యను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. తాజాగా ఈ సినిమానున ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే రోజున మహేశ్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ అవుతుంది. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని పరిస్థితుల్లో మూవీని ఏప్రిల్ 2 న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో మెగాస్టార్, సూపర్ స్టార్ మధ్య పోటీ రానుంది. అయితే రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే అప్పటికైనా పరిస్థితులు చక్కబడతాయా? లేదా? అన్నది చూడాలి మరి.
This Ugadi, Witness the MEGA MASS on big screens 💥💥#Acharya Grand Release on April 1 🔥#AcharyaOnApril1